టాలీవుడ్ లో క్రేజీ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న హీరో విజయ్ దేవరకొండ.వరుసగా నాలుగు సూపర్ సక్సెస్ లతో టాలీవుడ్ లో స్టార్ హీరోలకు పోటీ ఇచ్చే రేంజ్ లో విజయ్ దేవరకొండ తన ఇమేజ్ ని ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచుకున్నాడు.
ప్రస్తుతం టాలీవుడ్ లో 50 కోట్లు పైగా కలెక్ట్ చేసే హీరోల జాబితాలో విజయ్ దేవరకొండ కూడా ఉండడం విశేషం.ఇదిలా ఉంటే ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా షూటింగ్ చివరి దశలో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు.
మరోవైపు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు.
దీంతోపాటు మరో మూడు సినిమాలు వరకు విజయ్ దేవరకొండ లిస్టులో ఉన్నాయి.
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండ మహేష్ బాబు బ్యానర్లో ఓ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇప్పటికే మహేష్ బాబు తను హీరోగా తెరకెక్కుతున్న సినిమాలకు ఒక నిర్మాతగా కొనసాగుతున్నాడు.
తాజాగా అడవి శేష్ హీరోగా మేజర్ అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇప్పుడు విజయ్ దేవరకొండతో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పూర్తిగా మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ చూసుకుంటుందని తెలుస్తుంది.మరి ఈ సినిమాని మహేష్ బాబు ఏ దర్శకుడితో తెరకెక్కిస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.