ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణాలు, ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్నాయి.కలయికలు, రాజీనామాలతో ఎవరికి వారు ప్రజాభిమానం పొందడానికి, ఎన్నికలలో పోటీ కోసం ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నారు.
ఇదిలా వుంటే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది సెలబ్రిటీలని కూడా ఎవరికీ వారు తమ పార్టీకి ప్రచారం చేయడం కోసం ఉపయోగించుకోవడానికి రెడీ అవుతున్నారు.ఇప్పటికే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి విశేషమైన మైలేజ్ ని సొంతం చేసుకోవడంతో మిగిలిన పార్టీలు వైసీపీ, టీడీపీ పవన్ కళ్యాణ్ ఫాలోయింగ్ ని తగ్గించే ప్రయత్నం మొదలుపెడుతున్నారు.
ఇప్పటికే వైసీపీకి సినిమా ఇండస్ట్రీ నుంచి కొంత సానుకూలత వుంది.అయితే టీడీపీ కి నందమూరి ఫ్యామిలీ బలం అనుకున్న, ఒక్క బాలకృష్ణ తప్ప ఎవరు సపోర్ట్ గా ముందుకి రాలేదు.
ఇదిలా వుంటే ఇప్పుడు టీడీపీ కొత్త రాజకీయానికి తెర తీసింది.ఇప్పటికే తమ పార్టీలో వున్న సూపర్ స్టార్ మహేశ్ బావ గల్లా జయదేవ్ తో మహేశ్ బాబుని టీడీపీకి ప్రచారం కోసం రంగంలోకి దించే ప్రయత్నం చేస్తున్నారని రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
మరో వైపు కొద్ది రోజుల క్రితం మహేశ్ పెదనాన్న ఆదిశేషగిరిరావు కూడా టీడీపీ పార్టీలో చేరిపోయాడు.ఇదిలా వుంటే ఈ నేపధ్యంలో సూపర్ స్టార్ మహేశ్ కూడా టీడీపీకి మద్దతు ఇస్తాడని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా మహేశ్ భార్య నమ్రత శిరోద్కర్ ఓ నేషనల్ మీడియాకి క్లారిటీ ఇచ్చింది.ప్రస్తుతం ఏపీలో బాబు పరిపాలన బాగానే వుందని, అయితే టీడీపీకి మహేశ్ బాబు ప్రచారం చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
అలాగే ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశ్యం కూడా లేదని ప్రస్తుతం మహేశ్ తన సినిమాలతో ఫుల్ బిజీగా వున్నారని, రాజకీయాల జోలికి వెళ్ళే ఆలోచన లేదని నమ్రత చెప్పి, ఏపీ రాజకీయాలలో వినిపిస్తున్న ఊహాగానాలకి తెరదించింది.