డ్రగ్స్ కేసు.సుశాంత్ సింగ్ రాజపుత్ మరణం ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీని వణికించేస్తోంది.
సుశాంత్ సింగ్ రాజపుత్ సూసైడ్ మిస్టరీ ఏంటో తెలుసుకునేందుకు విచారణ చేస్తే నెమ్మదిగా అది డ్రగ్స్ కి సంబంధించిన కేసుగా మారిపోయింది.ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ లో కొందరు నటులు అరెస్ట్ అయినా సంగతి తెలిసిందే.అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయినా రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో బయటకు రావడంతో ఆమె తనకు ఎటువంటి సంబంధం లేదని తన పేరును అనవసరంగా పాడు చేస్తున్నారని ఆమె కోర్టుకు వెళ్ళింది.అయినప్పటికి ఎటువంటి ఉపయోగం లేకుండా రకుల్ ఇంటికి సమన్లు వచ్చాయ్.
అలాంటి ఈ సమయంలో బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత పేరు వినిపిస్తుంది.ఇది కాస్త ఆశ్చర్యం షాక్ కి గురి చేసినప్పటికి బాలీవుడ్ సెలబ్రిటీ మేనేజర్ జయసాహని విచారించగా నమ్రత పేరు బయటకు వచ్చిందని నిన్నటి నుంచి నేషనల్ మీడియా కోడై కూస్తుంది.
అధికార సమాచారం లేనప్పటికీ సాహా వాట్సాప్ చాట్స్ లో నమ్రత పేరు కోడ్ లాంగ్వేజ్ లో ఉన్నట్టు గుర్తించారు.
దీనిపైనా తెలుగు మీడియా దాదాపు మాట్లాడినప్పటికీ సోషల్ మీడియాలో నెటిజన్లు మాత్రం మిమ్స్ క్రియేట్ చేస్తూ గట్టిగా వైరల్ చేస్తున్నారు.
అయితే బండ్ల గణేష్ మాత్రం పాజిటివ్ గా ఓ ట్విట్ చేసారు.ఇన్ని వార్తలు వస్తున్నప్పటికి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే నమ్రత, మహేష్ బాబు అసలు స్పందించలేదు.
మరి డ్రగ్స్ కేసులో నమ్రత పేరు రావడం ఎవరైనా చేసిన కుట్ర లేక నిజామా అనేది తెలియాలి అంటే వేచిచూడాల్సిందే.ఏది ఏమైనా బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నమ్రత పేరు రావడం మహేష్ బాబు ఇమేజ్ డ్యామేజింగ్ అనే చెప్పాలి.