మహేష్ బాబు భార్య నమ్రత సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉంటారు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కేవలం నమ్రతనే కాదు పిల్లలు సితార, గౌతమ్ కూడా ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ అప్డేట్స్ ఇస్తుంటారు.
ఇక లాక్ డౌన్ సమయంలో అయితే మహేష్ బాబుతో కలిసి సితార్, గౌతమ్ ఏ రేంజ్ లో ఎంజాయ్ చేశారు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ నేపథ్యంలో నమ్రత ఎటువంటి రసాయనాలు లేకుండా కూరగాయలు పెంచుతుంది. ఆ విషయాన్నీ నమ్రతనే సోషల్ మీడియా వేదికగా ఆమె పెంచిన కూరగాయల తోట వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసారు.ప్రస్తుతం ఆ వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియోను చుసిన నెటిజన్లు అందరూ కూడా వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ వీడియోను నమ్రత షేర్ చేసిన సమయంలో వెజ్జీ ఫామ్ టూర్ అంటూ షేర్ చేసి ఆమె ఫామ్ లో పెంచిన వరి, టమాటా, మిరపకాయలు, పత్తిని చూపించారు.
నిత్యావసర వినియోగం కోసం ఆమె ఈ విధంగా పంటను పండించినట్టు.అది ఆమెకు ఎంతో నచ్చినట్టు ఆ వీడియోను షేర్ చేస్తూ చెప్పుకొచ్చారు.కాగా ఎంతోమంది సెలబ్రెటీలు ఇంటిపైనే టెర్రస్ గార్డెనింగ్ అంటూ కూరగాయలను పెంచుతున్నారు.లాక్ డౌన్ సమయంలో సమంత సైతం చెట్లను పెంచి ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం ఈ గార్డెనింగ్ ఐడియా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏది ఏమైనా ఇంటి కావలసిన కూరగాయలను సొంతంగా పెంచుకుంటే ఆ సంతృప్తే వేరు.
మరి మరు ఏం అంటారు.