సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరోయిన్ గా నటించి ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అందాల భామ నమ్రత శిరోద్కర్.ముంబై నేపధ్యం అయిన ఈ అమ్మడు మోడలింగ్ లో రాణించి, మిస్ ఇండియా టైటిల్ విన్నర్ అయ్యి కూడా మహేష్ బాబుని పెళ్లి చేసుకున్న తర్వాత రంగుల ప్రపంచాన్ని పూర్తిగా వదిలేసి గృహిణి పాత్రలోకి మారిపోయారు.
మహేష్ బాబు సక్సెస్ లో కచ్చితంగా ఎంతో కొంత ఆమె భాగస్వామ్యం ఉంటుందని అందరూ నమ్ముతారు.ఇండస్ట్రీలో బెస్ట్ జోడీగా అందరితో ప్రశంసలు అందుకున్న మహేష్ బాబు నమ్రత దాంపత్యం గురించి గొప్పగా చెప్పుకుంటారు.
ఈ మధ్యకాలంలో సోషల్ సర్వీస్ లో భాగంగా కృష్ణ సొంత ఊరుని దత్తత తీసుకొని అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె మహేష్ బాబుతో ప్రేమలో పడిన విషయం నుంచి తనకి లైఫ్ లో చాలా ముఖ్యమైంది ఏంటి అనే విషయాల వరకు అన్నింటిని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
మహేష్ తో సినిమా చేసే సమయంలో షూటింగ్ ఆఖరి రోజున నేను మహేష్ ప్రేమలో పడిపోయినట్లు గుర్తించాను.తరువాత ప్రపోజ్ చేసేసాను.
మహేష్ ని చూడగానే మా పేరెంట్స్ కూడా అతని ప్రేమలో పడిపోయారు.మా మధ్య ఇన్ సెక్యూరిటీ అనే ఫీలింగ్ ఎప్పటికి ఉండదు ఎందుకంటే ఒకరి మీద ఒకరి విపరీతమైన నమ్మకం ఉంది.
నా ఫేవరేట్ జ్యూయిలరీ అంటే కచ్చితంగా అది నా తాళి మాత్రమే అని నమ్రత చెప్పుకొచ్చింది.ఆమె మాటల ద్వారా మహేష్ బాబు విషయంలో తాను ఎంత కమిట్మెంట్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పేసింది అని సూపర్ స్టార్ అభిమానులు చెప్పుకుంటున్నారు.