టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కృష్ణ సినిమాల పరంగా ఎంత బిజీ బిజీగా ఉంటారో అదేవిధంగా ఆయన ఫ్యామిలీ కూడా అంతే విలువ ఇస్తూ అంతే దగ్గరగా ఉండేవారు.
కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యామిలీ కోసం సమయాన్ని కేటాయించేవారు.ఇదే విషయాన్ని మహేష్ బాబు కూడా ఇప్పటికే పలుసార్లు చెప్పుకొచ్చారు.
రోజుకు ఎన్ని షెడ్యూల్స్ ఉన్నప్పటికీ ఉదయాన్నే తన ఫ్యామిలీతో కలిసి భోజనం చేసేవారట.
అదేవిధంగా రాత్రి సమయంలో మనవళ్లు మనవరాళ్లతో మాట్లాడే వారట.
కృష్ణ వారసత్వాన్ని అందిపుచ్చుకుని మహేష్ తండ్రి బాటలోనే పయనిస్తూ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ పిల్లల కోసం కాస్త సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాడు.కృష్ణ, మహేష్ బాబు వేరు ఇంట్లో ఉంటారు అన్న విషయం తెలిసిందే.
అయితే వారంలో ఒకరోజు మహేష్ బాబు ఫ్యామిలీ తండ్రి కృష్ణ వద్ద గడుపుతారట.ఇదే విషయాన్ని తాజాగా నమ్రత చెప్పకనే చెప్పేసింది.
తాజాగా సూపర్ స్టార్ కృష్ణ, సితార, గౌతమ్ ఉన్న ఫోటోను షేర్ చేసింది.
ఈ ఫోటోను చూసిన ఘట్టమనేని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోటోని షేర్ చేస్తూ మండే లంచ్.ఎప్పుడు మిస్ అవ్వం.
ఎన్నో కథలు చెబుతూ ఉంటారు ఆయన నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.మేము అందరూ కూడా మామయ్య గారి కృష్ణ ని ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పుకొచ్చింది నమ్రత.
ఇక ఈ ఫోటోలో నవ్వులు చిందిస్తున్న కృష్ణను చూసి ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.అయితే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.
ఈ ఈ సినిమా తరువాత మహేష్ బాబు రాజమౌళి, త్రివిక్రమ్ ప్రాజెక్టులను పూర్తి చేయబోతున్నారు.ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా అయిపోయాయి.