సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఏం చేసినా సరే అందులో ఏదో ఒక ఇంట్రస్టింగ్ విషయం ఉంటుంది.అందుకే ఆయనకు లెక్కలేనంతమంది అభిమానులు ఉన్నది.
వయసు మీదపడుతున్నా నేటితరం హీరోలకు ఓ రోల్ మోడల్ గా నిలుస్తున్నారు మహేష్.గతేడాది మహర్షి, ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాలతో సూపర్ హిట్ కొట్టిన ప్రిన్స్ .లాక్ డౌన్ కారణంగా కుటుంబసభ్యులతో టైమ్ స్పెండ్ చేశారు.పిల్లలు సితార, గౌతమ్ లతో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానుల్ని అలరించారు.
ఇక ప్రస్తుతం గీతాగోవిందంతో సూపర్ హిట్ కొట్టిన పరుశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో యాక్ట్ చేస్తున్నారు.బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమాలో ప్రిన్స్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ భామ విద్యాబాలన్, సౌత్ ఇండియా స్టార్ యాక్టర్ అరవింద్ స్వామి కీ రోల్ ప్లే చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.
నవంబర్ లో ఈ చిత్ర సినిమా షూటింగ్ అమెరికాలో జరగుతుండగా.కరోనా వేవ్ వల్ల షూటింగ్ ను రెండు నెలలు పోస్ట్ పోన్ చేసింది చిత్ర యూనిట్.
ఒకవేళ షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరిగితే యూనిట్ సభ్యులు నవంబర్ లో అమెరికాకు వెళ్లాల్సి ఉంది.అక్కడే ఒకటిన్నర నెల షూటింగ్ తరువాత స్వదేశానికి వచ్చేలా షెడ్యూల్ ఖరారైంది.
కరోనా పై డబ్ల్యూహెచ్ ఓ సూచనలతో సినిమా షూటింగ్ ను పోస్ట్ పోన్ చేస్తే మంచిదని దర్శక నిర్మాతల భావించారట.ఈ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అవ్వడంతో మహేష్ బాబు కమర్షియల్ యాడ్స్ లలో యాక్ట్ చేస్తూ బిజీ అయ్యారు.
ప్రస్తుతం ఆ షూటింగ్ కొనసాగుతుండగా.సెట్లో మహేష్ బాబు మేకప్ గురించి నమ్రత ఆసక్తికర విషయాల్ని అభిమానులతో పంచుకున్నారు.
యాడ్ లో భాగంగా మహేష్ బాబు డబుల్ రోల్ ప్లే చేశారు.మీస కట్టు, పంచెతో చేసిన యాడ్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.
అయితే దాని వెనుక కష్టం ఎంత దాగుంది.కొన్నియాడ్స్ ఎంత చేసినా పర్ఫెక్ట్ గా రావు.
ముఖ్యంగా కట్టు మీసాలు విషయంలో.కానీ మేకప్ ఆర్టిస్ట్ పట్టాభి, డీపీఓ బోస్ లాంటి నిష్ణాతులు ఉంటే ఎలాంటి ఛాలెంజైనా ఈజీగా జరిగిపోతాయని నమ్రత చెప్పింది.