ప్రముఖ నటి , మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ నేడు 49వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.నమ్రత , మహేష్ లది ప్రేమ వివాహమే అని అందరికీ తెలిసిన విషయమే.
నమ్రత 1993 లో మిస్ ఇండియాగా ఎంపికై అనంతరం పలు హిందీ, తెలుగు భాష సినిమాలలో నటించి తనకంటూ మంచి స్థానాన్ని సొంతం చేసుకుంది.నమ్రత పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు దుబాయిలో సింపుల్ గా పార్టీ ఏర్పాటు చేశారట.
అందుకు సంబంధించిన ఒక పోస్ట్ ను మహేష్ బాబు తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.ఈ సందర్భంగా మహేష్ బాబు ఈరోజు నాకెంతో ఇష్టమైన, నేను ఎంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు, నమ్రత నీతో ప్రతి రోజు ప్రత్యేకంగా ఉంటుంది.
కానీ, ఈ రోజు మాత్రం మరెంతో ప్రత్యేకం అంటూ బర్త్ డే విషెస్ తెలియజేశాడు.
నమ్రత ను ఉద్దేశించి మహేష్ బాబు.“హ్యాపీ బర్తడే మై బాస్ లేడీ” అంటూ తెలియచేశాడు.ఈ పోస్టుకు నమ్రత స్పందిస్తూ నా ప్రతి సంవత్సరం ఎంతో స్పెషల్ చేస్తున్నందుకు థాంక్యూ సో మచ్ లవ్ యు టూ.అంటూ రిప్లై ఇచ్చింది.ఇక మహేష్ బాబు గత సంవత్సరం సంక్రాంతి పండుగ విడుదలైన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఆ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ దుబాయ్ లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.దాదాపు 20 రోజుల పాటు దుబాయ్ లోనే షూటింగ్ నిర్వహించబోతున్నట్లూ చిత్రయూనిట్ తెలియజేసింది.