తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు నటించిన టువంటి చిత్రం సరిలేరు నీకెవ్వరు.ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదలై పలు రికార్డులను బద్దలు కొడుతూ థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
ఇప్పటికే దాదాపుగా 220 కోట్లు ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.అయితే తాజాగా మహేష్ బాబు తన 27వ చిత్రం కోసం సన్నాహాలు చేస్తున్నాడు.
ఇందులో భాగంగా మహేష్ బాబు తన తదుపరి చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్రంలో మహేష్ సరసన నటించే హీరోయిన్ పై కొంత మేర సందిగ్ధత నెలకొంది.
దీంతో మహేష్ బాబు సతీమణి నమ్రతా భరత్ అనే నేనులో మహేష్ సరసన జోడి కట్టిన టువంటి కియారా అద్వానీ అయితే బాగుంటుందని సూచించినట్లు సమాచారం.అంతేగాక గతమ్లో వీరిద్దరి కాంబినేషన్ లో వచినటువంటి భరత్ అనే నేను చిత్రం మంచి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
దీంతో మరోసారి సెంటిమెంట్ గా నమ్రత కియారా అడ్వాణీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు కూడా కియారా అద్వానీ నీ సంప్రదించినట్లు సమాచారం.
అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్ర కథాంశం వివరాల గురించి పలు పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ మాఫియా డాన్ పాత్రలో నటిస్తున్నట్లు, అంతేగాక ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లు తెలుస్తోంది.అయితే ఇక అధికారికంగా పట్టణ చేసి లాంచ్ చేయడమే మిగిలి ఉంది.అయితే ఇది ఇలా ఉండగా ప్రస్తుతం మహేష్ బాబు ఉ సరిలేరు నీకెవ్వరు చిత్రం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.
అంతేకాక తన ఫ్యామిలీతో విదేశీ టూర్ లో సరదాగా గడుపుతున్నాడు.