ఇటీవల సినీ నటిని చీట్ చేసిన కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై విడుదల అయిన టాలీవుడ్ కెమెరామెన్ శ్యామ్ కె.నాయుడు కి హైదరాబాద్ లోని నాంపల్లి కోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది.
సినీ నటి సాయిసుధను మోసం చేశారనే కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.వివరాల్లోకి వెళ్తే, పెళ్లి చేసుకుంటానని చెప్పి కొన్నేళ్లుగా తనతో సంబంధం పెట్టుకుని… ఇప్పుడు పెళ్లి మాటెత్తితే దాటేస్తున్నాడంటూ ఆయనపై సాయిసుధ అనే సినీనటి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఇటీవల ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేయగా, ఆ తర్వాత రెండు రోజులకు ఆయనకు బెయిల్ మంజూరైంది.అయితే తాను, సాయిసుధ ఇద్దరం రాజీకొచ్చామని కోర్టు కు చెప్పిన శ్యామ్ బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో ఆయనకు బెయిల్ మంజూరవ్వగా బయటకు వచ్చేశాడు.అయితే, వారిద్దరి మధ్య ఎలాంటి రాజీ ఒప్పందం జరగలేదని, కోర్టుకు ఆయన సమర్పించిన పత్రాలు నకిలీవని కోర్టుకు సాయిసుధ తెలిపడం తో ఆయన కు మంజూరు అయిన బెయిల్ ను రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
అంతేకాకుండా,నకిలీ పత్రాలను సమర్పించిన నేపథ్యంలో ఆయనపై ఫోర్జరీ కేసు కూడా నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.
కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.‘అర్జున్ రెడ్డి’ అలానే కొన్ని చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సాయిసుధ మంచి గుర్తింపును తెచ్చుకుంది.ఆమె ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మోసం చేసినట్లు ఆరోపణలు చేస్తూ పోలీస్ కేసు పెట్టడం తో టాలీవుడ్ లో ఇదో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.