మొదటగా సినిమా పరిశ్రమకి హీరోయిన్ అవ్వాలని ఎన్నోకలలతో, ఆశలతో వచ్చినప్పటి కీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకోగా చివరికి పలు ధారావాహికలలో నటించి నటనా ప్రతిభను నిరూపించుకుని హీరోయిన్లుగా ఎదిగినటువంటి నటీమణులు ఎందరో ఉన్నారు. ఇందులో బాలీవుడ్ సీరియల్ హీరోయిన్ నాగిని బ్యూటీ “మౌని రాయ్” ఒకరు.
ఈ అమ్మడు మొదటగా తెలుగులో ప్రముఖ ఎంటర్ టైం మెంట్ ఛానల్ అయిన జెమినీ టీవీలో ప్రసారమయ్యేటువంటి “నాగిని” అనే ధారావాహికలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.అయితే ఈ ధారావాహికలో ఈ అమ్మడు నటనా ప్రతిభ మరియు అందాల ఆరబోతతో ప్రేక్షకులని బాగానే మెప్పించింది.
దీంతో మొదట్లో పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలను దక్కించుకుంది. ఇందులో భాగంగా కే.జి.ఎఫ్ హిందీ అనువాద చిత్రంలో స్పెషల్ సాంగ్ లో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకుంది. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్లో పలు చిత్రాలలో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది. అంతేగాక పలు చిత్రాలలోని స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తోంది.
కాగా తాజాగా ఈ విషయంపై మౌని రాయ్ స్పందిస్తూ తాను సినిమా పరిశ్రమకు వచ్చినమొదట్లో బాగానే అవకాశాల కోసం ఎదురు చూశానని ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా నాగిని ధారావాహికలో నటించే అవకాశం వచ్చిందని అయితే ఈ ధారావాహికలో నటించేటప్పుడు తనను తాను నిరూపించుకుని ఎలాగైనా స్టార్ గా ఎదగాలని చాలా శ్రమించానని చెప్పుకొచ్చింది. అంతేగాక తన లైఫ్ లో నాగిని సీరియల్ ఎంతో ముఖ్య పాత్ర పోషించిందని, తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నాగిని సీరియల్ అని చెప్పుకొచ్చింది.
ఈ నాగిని సీరియల్ తనకి దాదాపుగా ఆరు కు పైగా టెలివిజన్ రంగంలో అవార్డులను కూడా తెచ్చిపెట్టింది అని తెలిపింది అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మౌని రాయ్ హిందీలో “బ్రహ్మాస్త్ర” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. కాగా ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “అయాన్ ముఖర్జీ” దర్శకత్వం వహిస్తుండగా టాలీవుడ్ కింగ్ నాగార్జున, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, అలియా భట్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.