నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు లో ప్రస్తుతం వరకు టీఆర్ఎస్ వైపే దూసుకెళ్లిన విజయ లక్ష్మి ఒక్క సారిగా యూటర్న్ తీసుకుంది.దీని ఫలితంగా ఇప్పటి వరకు గెలుపు తమదే అని సంబర పడుతున్న టీఆర్ఎస్ నేతల్లో ఆనందాన్ని మాయం చేస్తూ ఫలితాలు పదో రౌండ్కు ఊహించని విధంగా మారిపోయాయి.
దీని ఫలితంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియలో టీఆర్ఎస్కు షాక్ తగిలింది.కాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక లో ఇక విజయం తమదే అని ఎప్పటి నుండో టీఆర్ఎస్ నేతలు ఫిక్స్ అవ్వగా ఆ నమ్మకం మొదటి నుండి 9 రౌండ్ల వరకు కొనసాగింది.
కానీ పదో రౌండ్ వచ్చేసరికి అనుహ్యంగా కాంగ్రెస్ లీడ్ సాధించింది.పదో రౌండ్లో టీఆర్ఎస్కు 2991 ఓట్లు రాగా, కాంగ్రెస్కు 3166 ఓట్లు వచ్చాయి.
దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి 175 ఓట్ల లీడ్ వచ్చింది.మొత్తంగా పదిరౌండ్లు ముగిసే సరికి టీఆర్ఎస్ 35,589 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ 27,653 ఓట్లు సాధించిందని సమాచారం.