కొడుకులని స్టార్ హీరోలుగా నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్న కింగ్ నాగార్జునకి వాళ్ళ కెరియర్ పెద్ద తలనొప్పిగా మారింది.నాగ చైతన్య కొంత సక్సెస్ ట్రాక్ లో పడిన అఖిల్ విషయంలో మాత్రం నాగార్జున ఆలోచనలు వర్క్ అవుట్ అవడం లేదు.
మొదటి సినిమా నుంచి అఖిల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న నాగార్జున అతనికి సక్సెస్ అందించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు.కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు అంతగా వర్క్ అవుట్ కావడం లేదు.
తన ఏజ్ కి సరిపోయే కథలు చేస్తే ఫలితం ఎలా ఉండేదో తెలియదు కమర్షియల్ జోనర్ అంటూ అనవసరమైన కంటెంట్ ని జోడించడం వలెనే అఖిల్ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి.మిస్టర్ మజ్ను విషయంలో కాస్తా మారిన కంటెంట్ మరీ రొటీన్ గా ఉండటంతో వర్క్ అవుట్ అవ్వలేదు.
ఇప్పుడు కూడా అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాపై నాగార్జున ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో ఈ మధ్యే ఫైనల్ కట్ చూసినట్లు ప్రచారం జరుగుతుంది.
బొమ్మరిల్లు, పరుగు సినిమాల తర్వాత భాస్కర్ను ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయారు.అలాంటి దర్శకుడు చెప్పిన కథ నచ్చి అఖిల్ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు.ఇదిలా ఉంటే సినిమాలో కొన్ని సన్నివేశాలపై నాగార్జున అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.వీటిని రీ షూట్ చేయాలని దర్శకుడికి నాగార్జున సూచించినట్లు ప్రచారం కూడా జరుగుతుంది.
అయితే దీనిపై ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు.కానీ గతంలో కూడా కొన్ని సినిమాలకు నాగార్జున రీ షూట్ చేయించాడు.
రీ షూట్ చేస్తే సినిమా బాగోకపోవడం కాదు.ఇంకా బాగా చేయడానికి ప్రయత్నం అని క్లారిటీ ఇచ్చాడు.
ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలో కూడా కొన్ని సన్నివేశాలను ఇంకా బాగా షూట్ చేయాలని ప్రయత్నించాలని బొమ్మరిల్లు భాస్కర్కు నాగార్జున చెప్పినట్లు వార్తలొస్తున్నాయి.అయితే కింగ్ రీషూట్ చెప్పిన గత సినిమాలు మూడు ఫ్లాప్ కావడంతో బ్యాచలర్ మీద ఆ ప్రభావం ఉంటుందేమో అని అభిమానులు భయపడుతున్నారు.