కరోనా ఎఫెక్ట్ తో సినిమా థియేటర్లు పూర్తిగా మూత పడ్డాయి.ఇక షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.
ఇండస్ట్రీలో గత ఐదు నెలల నుంచి సినీ కార్మికుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరికీ పని లేదు.మరో విప్పు సినిమాలు సగం షూటింగ్ చేసి ఆగిపోయిన వాటితో నిర్మాతలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏది ఏమైనా చిత్ర పరిశ్రమకి ఈ ఏడాది గడ్డు కాలం అని చెప్పాలి.ఇదిలా ఉంటే కరోనా పరిస్థితులు కుదుటపడకపోయిన ఆరంభంలో ఉన్నంత భయం ఇప్పుడు ప్రజలలో లేదు.
కరోనా వచ్చిన ధైర్యంగా ఎదుర్కోగలం అనే ధీమా వచ్చింది.అలాగే కరోనా వచ్చినవాళ్లు కూడా ఎక్కువగా రికవరీ అవుతూ ఉండటంతో టెన్షన్ తగ్గింది.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం కొన్ని షరతులతో సినిమా షూటింగ్ లకి అనుమతి ఇచ్చింది.అయితే కొంత మంది సెలబ్రెటీలు షూటింగ్ లకి ధైర్యం చేయడం లేదు.
ఈ విషయంలో నాగార్జున ముందుండి అందరికి ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేశారు.ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 4 షూటింగ్ లో పాల్గొన్న కింగ్ నాగార్జున తాజాగా తన కొత్త చిత్రం వైల్డ్ డాగ్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశాడు.
హైదరాబాదులో వైల్డ్ డాగ్ షూటింగ్ మొదలైంది.అహిశోర్ సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ కోసం చిత్రం యూనిట్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది.నాగార్జున చాలా హుషారుగా ఈ చిత్రం షూటింగులో పాల్గొన్నారని యూనిట్ చెబుతోంది.ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ విడుదల చేసింది.మొత్తానికి నాగార్జున చేసిన ధైర్యం మిగిలిన హీరోలు కూడా చేస్తే ఇక సినిమా షూటింగ్ లో యధావిధిగా మొదలవుతాయి.50 ఏళ్ళు దాటినా నాగార్జున కరోనాకి భయపడకుండా షూటింగ్ స్టార్ట్ చేసాడంటే మిగిలిన కుర్ర హీరోలు అందరూ హ్యాపీగా షూటింగ్ లో పాల్గొనవచ్చు అనే మాట ఫిలిం నగర్ లో వినిపిస్తుంది.