తెలుగు సినీ నటుడు అక్కినేని మన్మథుడు నాగార్జున గురించి అందరికీ తెలిసిందే.ఎన్నో సినిమాల్లో నటించిన నాగార్జున ఇప్పటికి సినిమాలలో తన నటనను కొనసాగిస్తున్నారు.
వయస్సు మీద పడిన కూడా ప్రస్తుతం యువ హీరోలతో పోటీ గా నటిస్తున్నాడు నాగార్జున.కొన్ని సినిమాలలో నాగార్జున అతిధి పాత్రలో నటించగా, మరి కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలో నటించాడు.
ఇదిలా ఉంటే నాగార్జున ఆ రేంజ్ లో కష్టపడడం వల్లే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానంటూ కొన్ని విషయాలు పంచుకున్నాడు.
అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వైల్డ్ డాగ్.
ఈ సినిమాలో నాగార్జున హీరోగా నటించాడు.ఇక దియామీర్జా,సయామిఖేర్, మయాంక్, ప్రదీప్, అలీ రజా, ప్రదీప్, ప్రకాష్ లు కీలక పాత్రలో నటించారు.
ఈ సినిమా మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ పతాకంపై నెంబర్ సిక్స్ గా నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు ఇక ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది.మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సందర్భంగా సినీ బృందం సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు.ఈ విధంగా హీరో నాగార్జున కొన్ని విషయాలు పంచుకున్నాడు.తను కొత్త ప్రయత్నం కోసం సినిమా తీసిన ప్రతి సారి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వాళ్లకు ధన్యవాదాలు తెలిపాడు. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో ఈ సినిమాను విడుదల చేయాలా?ఆడియన్స్ వస్తారా? అని అనుకున్నారట.
కానీ సినిమా బాగుంటే ప్రేక్షకులనుండి సపోర్ట్ తప్పనిసరి ఉంటుందని అర్థమైందని తెలిపాడు.ఇక ఈ సినిమా కలెక్షన్ బాగా ఉన్నాయని ప్రముఖ నిర్మాత నిరంజన్ చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.తనను ప్రోత్సహిస్తున్న అభిమానుల అండదండలతోనే తను కొత్త రకం సినిమాలు చేయగలుగుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అభిమానులకు ఎప్పుడు రుణపడి ఉంటానంటూ.
ప్రతి భారతీయుడు చూడాల్సిన సినిమానని చాలామంది అన్నారని తెలిపాడు.ఈ సినిమాకు, తనకు వచ్చిన బెస్ట్ అప్రిసియేషన్ అని తెలిపాడు.
చాలామంది ఆయనను ఈ ఏజ్ లో రిస్కు అవసరమా అనగా.తను రిస్క్ లు చేసినందుకే ఈ స్థాయికి రాగలిగానంటూ అన్నారు.
ఈ రిస్క్ చేయడం తనకు కొత్తేమీ కాదని, ప్రేమించే పని చేసినప్పుడు శ్రమ ఎప్పుడూ ఉండదని తెలిపాడు.ఇక ఈ సినిమాకు మంచి గుర్తింపు వచ్చినందుకు దర్శకుడుకి థాంక్స్ తెలిపాడు.
ఈ సినిమా బృందం టీం మెంబర్స్ అందరూ మంచి సపోర్ట్ చేశారని, వాళ్లందరికి మంచి అప్రిసియేషన్ వస్తున్నందుకు సంతోషమని తెలిపాడు.