ది ఘోస్ట్ ఫ్లాప్ తర్వాత నాగార్జున తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు.ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కిన ఘోస్ట్ మూవీ నిరాశపరచింది.
అందుకే తన తర్వాత సినిమా విషయంలో నాగ్ చాలా ఆచి తూచి అడుగులేస్తున్నాడు.నాగార్జున తన నెక్స్ట్ సినిమాని రైటర్ ప్రసన్న డైరెక్షన్ లో చేస్తున్నట్టు తెలుస్తుంది.
రైటర్ గా సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తున్న ప్రసన్న కెరీర్ లో ఫస్ట్ టైం మెగా ఫోన్ ఎత్తుతున్నారు.
ఈ సినిమా కూడా ప్రసన్న మార్క్ ఎంటర్టైనింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.
ధమాకా రిజల్ట్ చూశాక నాగార్జున కూడా ప్రసన్న మీద నమ్మకం పెంచుకున్నారు.అయితే ధమాకాలో స్టోరీ అంత గొప్పగా లేకపోయినా సరే నాగార్జున మాత్రం ప్రసన్న మీద నమ్మకం ఉంచినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాలో నాగార్జున కూడా డ్యుయల్ రోల్ లో నటిస్తారని టాక్.అంతేకాదు సినిమాలో మరో యంగ్ హీరో కూడా ఉంటాడని అంటున్నారు.మొత్తానికి ప్రసన్నతో నాగ్ సినిమా ఆడియన్స్ ని పక్కా ఎంటర్టైన్ చేస్తుందని అంటున్నారు. ధమాకాతో మరో హిట్ అందుకోవడం తో ప్రసన్న రైటింగ్ మీద ఆడియన్స్ కి సూపర్ కాన్ ఫిడెన్స్ వచ్చేసింది.