త్రివిక్రమ్ గొడవపై స్పందించిన నాగార్జున

టాలీవుడ్ స్టార హీరో కింగ్ నాగార్జున కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ మన్మధుడు.ఈ సినిమాకి దర్శకుడు విజయ్ భాస్కర్ అని దాని వెనుక కథ, మాటలు అన్ని కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ వే అనే విషయం అందరికి తెలిసిందే.

 Nagarjuna Not Interested To Saying On Trivikram-TeluguStop.com

ఆ సినిమాలో పేలే ప్రతి డైలాగ్ త్రివిక్రమ్ పెన్ను నుంచి వచ్చిందే.అయితే ఆ సినిమా తర్వాత నాగార్జున, త్రివిక్రమ్ తో ఏ కారణంగానే మరొక సినిమా చేయలేదు.

అప్పట్లో వారిద్దరి మధ్య సినిమా ఉంటుందని న్యూస్ వచ్చిన ఎందుకనో కార్యరూపం దాల్చలేదు.తరువాత ఏ సందర్భంలో కూడా వీరిద్దరు ఎప్పుడు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకున్న సందర్భాలు లేవు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం మన్మధుడు సినిమా సీక్వెల్ గా మన్మధుడు 2 తెరకెక్కుతుంది.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా మన్మధుడు సినిమా గురించి అడిగిన సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి నాగార్జున ప్రస్తావించకుండా కేవలం దర్శకుడు విజయ్ భాస్కర్ గురించి మాత్రమే చెప్పారు.

దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంతో దీనిపై మరల నాగార్జున స్పందించాడు.మన్మధుడు సినిమా స్టొరీని విజయ్ భాస్కర్ తనకి చెప్పాడని, అందులో ప్రతి సీన్, ప్రతి డైలాగ్ దర్శకుడే తనతో చెప్పించారని అందుకే అతని గురించి మాట్లాడా అని చెప్పుకొచ్చారు.

ఇందులో మరో ఆప్షన్ లేదని చెప్పుకొచ్చారు.దేంతో నాగార్జున, త్రివిక్రమ్ మీద చెప్పలేని స్థాయిలో ఏదో పెద్ద గొడవ జరిగిందని టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube