టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున గతకొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు.ఈ క్రమంలో ఆయన చేసే ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేస్తుండటంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టి తీరాలనే కసితో ఉన్నాడు.
కాగా నాగ్ చేసిన సూపర్ హిట్ మూవీ మన్మధుడు సీక్వెల్ ‘మన్మధుడు-2’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చూసింది.ఇక ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే కాప్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్న నాగ్, ఎప్పటి నుండో మరో సీక్వెల్ కోసం రెడీ అవుతూ వస్తున్నాడు.
నాగ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’కు సీక్వెల్ మూవీ ఉంటుందని చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.అప్పటి నుండి ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమాకు బంగార్రాజు అనే ఆసక్తికరమైన టైటిల్ను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.ఇక దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా కథను చాలా కష్టపడి రాస్తూ వస్తున్నాడు.
అయితే అది మరింత ఆలస్యం అవుతుండటంతో నాగ్ తన వద్దకు వచ్చిన సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు.
ఈ క్రమంలోనే నాగ్ ప్రస్తుతం పలు సినిమాలకు ఓకే చెప్పి ఉండటంతో, బంగార్రాజు సినిమాను ఇప్పట్లో పట్టాలెక్కించే ఛాన్స్ లేదని తెలుస్తోంది.
అటు కళ్యాణ్ కృష్ణ ఏడాదిన్నరగా ఈ సినిమా కోసం కష్టపడుతుండగా, ఇప్పుడు నాగ్ ఆయన సినిమాకు నో చెప్పాడట.దీనికి బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది.
కళ్యాణ్ కృష్ణ లాస్ట్ మూవీ నేలటిక్కెట్ బాక్సాఫీస్ వద్ద భారీ ఫ్లాప్ మూవీగా నిలవడమే కాకుండా ఆయన్ను ప్రేక్షకులు రిజెక్ట్ చేసేలా చేసింది.అటు నాగ్ కూడా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
దీంతో ఇప్పట్లో కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయడం కుదరదని భావించిన నాగ్, అందుకే ఈ ప్రాజెక్ట్కు నో చెప్పాడట.