దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం రేకెత్తించిన దిశా హత్యాచారం ఉదంతాన్ని అందరికీ తెలిసిందే.ఈ ఘటనకు సంబంధించిన ఉదంతాన్ని పలు దర్శకనిర్మాతలు సినిమాగా తెరకెక్కించి ప్రేక్షకులను అప్రమత్తం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇంతలోనే ఈ లిస్టులో నేనున్నాను అంటూ దూసుకొచ్చాడు కింగ్ నాగార్జున.
అక్కినేని నాగార్జున మన్మధుడు 2 డిజాస్టర్ తరువాత ఓ కాప్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తున్నాడని గతకొంత కాలంగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే.
కాగా తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ పోస్టర్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.ఈ సినిమాకు వైల్డ్ డాగ్ అనే టైటిల్ను పెట్టగా ఈ సినిమాలో నాగ్ ఓ ఎన్ఐఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
దుండగులను ఎన్కౌంటర్ చేసే క్రమంలో నాగ్ స్టిల్ ఈ పోస్టర్లో మనకు చూపించారు చిత్ర యూనిట్.
ఈ సినిమాను సోలోమాన్ డైరెక్ట్ చేస్తుండగా నిరంజన్ రెడ్డి మరియు అన్వేష్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి సినిమాను అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది.
.