టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని కి.సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి.
ముఖ్యంగా ఈ విధానానికి సంబంధించి ఇటీవల పవన్ కళ్యాణ్ “రిపబ్లిక్” సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి దారుణంగా విమర్శల వర్షం కురిపించడం జరిగింది.
ఏపీ మంత్రులు సన్నాసులు అంటూ పవన్ కళ్యాణ్ దారుణంగా విమర్శించారు.దీంతో పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు స్పందించి.
ఆయన మాట్లాడిన తీరును ఖండించడం జరిగింది.అదేవిధంగా ఆన్ లైన్ బుకింగ్ విధానాన్ని ఇండస్ట్రీ పెద్దలే తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలియజేశారు.
మరోపక్క పవన్ చేసిన వ్యాఖ్యలకి ఇండస్ట్రీకి సంబంధం లేదని తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించడం జరిగింది.
ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున లవ్ స్టోరీ సినిమా సక్సెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు.సినిమా విజయం సాధించడంతో సినిమా యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకవైపు తుఫాను మరోవైపు కరోనా ఉన్నాగాని సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారని స్పష్టం చేశారు.
ఇదే కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నట్లు నాగార్జున మాట్లాడుతూ తెలుగు ప్రజలు సినిమా నీ.ఎంతగానో ప్రేమిస్తారు అని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు దీవెనలు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో అవసరమని స్పష్టం చేశారు.ఇప్పటివరకు ఈ విషయంలో రెండు ప్రభుత్వాలు మంచి చూపు అందించాలని ఇకముందు కూడా అదే చల్లని చూపు… ఇండస్ట్రీపై కొనసాగించాలని నాగార్జున విజ్ఞప్తి చేశారు.