నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన్మధుడు 2’ చిత్రం ట్రైలర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.భారీ అంచనాలున్న ఈ చిత్రం ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచింది.
మొదటి నుండి కూడా ఈ చిత్రంలో నాగార్జున చాలా రొమాంటిక్గా ఉంటాడని ప్రచారం జరుగుతుంది.అందుకు తగ్గట్లుగా ఈ ట్రైలర్లోనే ముద్దు సీన్స్ పెట్టి సినిమాలో ఏ స్థాయి రొమాన్స్ ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు.
ఆరు పదుల వయసులో కూడా నాగార్జున ముద్దు సీన్స్ చేయడం ఒకింత ఆశ్చర్యంగా ఉందంటూనే ప్రేక్షకులు ఆ ముద్దు సీన్స్ను ఎంజాయ్ చేస్తారని చిత్ర యూనిట్ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.తప్పకుండా సినిమా ఎంటర్టైన్మెంట్తో కూడా ఆకట్టుకుంటుందనిపిస్తుంది.ఎందుకంటే వెన్నెల కిషోర్ సినిమాలో ఫుల్ లెంగ్త్ పాత్రను పోషించాడు.నాగార్జునకు తోడుగా వెన్నెల కిషోర్ ఉండటంతో పాటు లక్ష్మీ మరియు జాన్సీలు కూడా తమ వంతు కామెడీ పండించబోతున్నారు.
ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంకు పెద్దగా పోటీ కూడా ఏమీ లేదు.అందుకే ఈ చిత్రం మంచి వసూళ్లను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.
నాగార్జున కెరీర్లో ‘మనం’ ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఉంది.అది ఫ్యామిలీ సినిమా కనుక దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఈ సినిమా నాగ్ కెరీర్లో నిలిచిపోయే వసూళ్లను రాబట్టడం ఖాయం అని ట్రైలర్ విడుదల తర్వాత కూడా అనిపిస్తుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
.