నాగార్జున హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా తెరకెక్కిన ‘మన్మధుడు 2’ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాలున్న ఈ చిత్రంను రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో స్వయంగా నాగార్జున నిర్మించిన విషయం తెల్సిందే.
ఈ చిత్రం మొత్తం నిర్మాణం విలువ పాతిక కోట్లు అయినట్లుగా సమాచారం అందుతోంది.అయితే ఈ చిత్రంకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో విడుదలకు ముందే ఈ చిత్రం దాదాపుగా 55 కోట్ల మేరకు బిజినెస్ చేసిందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
గతంలో నాగార్జున నటించిన ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదు.శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ద్వారా ఈ చిత్రం ఏకంగా 26 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది.ఇక థియేట్రికల్ రైట్స్ ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.తద్వారా దాదాపుగా 30 కోట్లు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.అంటే విడుదలకు ముందే మన్మధుడు 2 చిత్రానికి ఏకంగా 30 కోట్ల లాభం అన్నట్లు.
స్టార్ హీరోల సినిమాలు భారీ బడ్జెట్తో తెరకెక్కి 70, 80 కోట్లు బిజినెస్ చేసినా కూడా పెద్దగా నిర్మాతలకు మిగిలేది ఏమీ లేదు.
ఎందుకంటే బడ్జెట్ ఎక్కువ పెట్టిన కారణంగా భారీ బిజినెస్ చేసినా ప్రయోజనం ఉండటం లేదు.కాని నాగార్జున మాత్రం చాలా సేఫ్ గేమ్ ఆడాడు.కేవలం పాతిక కోట్లతో సినిమాను ఫినీష్ చేసి సినిమాకు భారీ క్రేజ్ వచ్చేలా చేశాడు.దాంతో ఈ చిత్రం ఏకంగా 55 కోట్ల వరకు బిజినెస్ చేస్తుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.