బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం చివరి వారానికి చేరుకుంది. 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు.
ఈ ఏడుగురిలో బిందుమాధవి, అఖిల్ మధ్య టైటిల్ పోరు నడుస్తోంది.ఈ క్రమంలోనే వీరిద్దరిలో టైటిల్ ఎవరు సొంతం చేసుకుంటారని పెద్ద ఎత్తున చర్చలు మొదలు పెట్టారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి గ్రాండ్ ఫినాలే మూడు రోజుల పాటు జరుగుతుందని సమాచారం.
ఆదివారం టైటిల్ విన్నర్ ఎవరో ప్రకటించనున్నారు.
ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి గ్రాండ్ ఫినాలే ఎంతో ఘనంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కంటెస్టెంట్ లు ఏడు మంది ఉండగా శుక్రవారం ఒకరిని, శనివారం ఒకరిని హౌస్ నుంచి బయటకు పంపనున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఆదివారం విన్నర్ ను ప్రకటించనున్నారు.తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ ఫినాలే రోజు ఈ కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది.
ఇతర కమిట్మెంట్స్ కారణంగా నాగార్జున ఫినాలేకు అందుబాటులో ఉండరని సమాచారం.
ఇక నాగార్జున ఈ కార్యక్రమానికి హోస్ట్ గా అందుబాటులో లేకపోతే ఈయన స్థానంలో హీరో వెంకటేష్ లేదా రామ్ చరణ్ హోస్ట్ గా బాధ్యతలు తీసుకుంటారని తెలుస్తోంది.వీరిద్దరిలో దాదాపు రామ్ చరణ్ ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తారని సమాచారం.మరి ఈ విషయం గురించి వస్తున్న వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.