దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.మొదటి దశలో ఫ్రంట్ లైన్ లో అప్పట్లో కరోనా లాక్ డౌన్ సమయంలో పనిచేసిన వారికి వ్యాక్సిన్ వేయడం జరిగింది.
అయితే ఇటీవల మార్చి ఫస్ట్ నుంచి రెండో వ్యాక్సినేషన్ ప్రక్రియలో 60 సంవత్సరాలకు పైబడిన వారికి అదేవిధంగా 45 సంవత్సరాలు కలిగినవారికి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కేంద్రం చేస్తున్న సంగతి తెలిసిందే.రెండో విడత లో చాలా మంది రాజకీయ నాయకులు మరియు సెలబ్రిటీలు వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది.
ఈ నేపధ్యంలో తాజాగా టాలీవుడ్ కింగ్ నాగార్జున కరోనా టీకా వేయించుకోవటం జరిగింది.ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలిపారు.నిన్న నేను కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నాను.అర్హులైన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ను తీసుకోవాలి.
దీనికోసం ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని, టీకా వేయించుకోవాలి అని కోరారు.ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నాగార్జున కరోనా వ్యాక్సిన్ వేయించుకోవటం జరిగింది.
ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు.ఏప్రిల్ రెండో తారీఖున ఈ సినిమా రిలీజ్ కానుంది.
.