టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున.ఈయన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకొని.
ఈయన వారసత్వాన్ని కూడా అదే గుర్తింపుతో నడిపించాలని వారిని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.అందులో నాగ చైతన్య కొన్ని సక్సెస్ లతో కొంతవరకు గుర్తింపు అందుకున్నాడు.
అఖిల్ మాత్రం ఇప్పటికీ ఎటువంటి క్రేజ్ అందుకోలేదు.సిసింద్రీ సినిమా తో బాలనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన అఖిల్.
ఊహ తెలియని వయసులోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు.ఇక ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాల్లో నటించగా అంత సక్సెస్ అందుకోలేదు.
ఇక ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల్లో నటించాడు.ఈ సినిమా ను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తున్నారు.ఇప్పటివరకు ఎటువంటి సక్సెస్ అందుకోని అఖిల్.ఈ సినిమాపై ఆశలు పెంచుకున్నాడు.
ఇందులో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తుంది.ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలను నాగార్జున అడ్డు పడుతున్నాట.
నిజానికి ఈ సినిమా రెండేళ్ల క్రితం మొదలయింది.కానీ ఇప్పటివరకు ఈ సినిమా విడుదలకు ముహూర్తం రాలేదు.ఇక ఈ ఏడాది విడుదల చేయాలని అనుకోగా.ప్రస్తుతం కరోనా వల్ల మళ్లీ వాయిదా పడింది.
ఇక ఓ టి టి లో విడుదల చేయాలని వార్తలు కూడా వినిపించాయి.కానీ ఇప్పటివరకు అఖిల్ తన కెరీర్ లో ఎటువంటి సక్సెస్ అందుకో పోగా ఆశలన్నీ ఈ సినిమాపై పెట్టుకోవడంతో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం కోవిడ్ కారణంగా ఈ సమయంలో థియేటర్లు తెరుచుకోవడం సాధ్యం కాదు.అటువంటిది ఈ సినిమా విడుదల కోసం మరో మూడు నెలలు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని.
ఇక మరింత ఆలస్యం చేస్తే ఓ టీ టీ లో విడుదల చేసిన కూడా లాభం ఉండదని నిర్మాతలు చర్చ చేసినట్లు తెలియగా.అందుకు నాగార్జున ఓటీటీ విడుదలకు అడ్డు పడినట్లు తెలుస్తుంది.
తన కొడుకు సినిమా మొదట థియేటర్లో నే విడుదల కావాలని గీత ఆర్ట్స్ బన్నీ వాసు కి ముందే చెప్పారట నాగార్జున.ఇక ఈ సినిమా ఎందులో విడుదల అవుతుందో చూడాల్సిందే.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అఖిల్ మరో డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేయనున్నాడు.అంతే కాకుండా ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా తన తండ్రి నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమాలో ఓ పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.