నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమా సెప్టెంబర్ 24న విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
విడుదల అయినా రోజు ఎలాంటి స్పందన వచ్చిందో ఇప్పటికే అదే రేంజ్ లో స్పందన వస్తుంది.నాగ చైతన్య కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు వాసులు చేసే దిశగా లవ్ స్టోరీ సినిమా అడుగులు వేస్తుంది.
ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవి పెయిర్ కు 100 శాతం మార్కులు వేస్తున్నారు ప్రేక్షకులు.శేఖర్ కమ్ముల మరొకసారి తన మార్క్ సినిమాను ప్రేక్షకులకు అదించాడు.
ఈ సినిమా అంత సక్సెస్ సాధించిన సందర్భంగా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్.ఈ సక్సెస్ మీట్ కు నాగార్జున కూడా ముఖ్య అతిధిగా వచ్చారు.
ఆయన వేదికపై మాట్లాడుతూ చైతు గురించి చాలా ఎమోషనల్ గా చెప్పారు.
లవ్ స్టోరీ సినిమా ఊరికే హిట్ అవలేదని సినిమాలోని ప్రతి సన్నివేశం ఎంతో బాగా తీసారని.
అసలు సినిమా కోసం ఎక్కడెక్కడో లొకేషన్స్ అవసరం లేదని కేవలం టెర్రస్ చాలు మంచి సినిమా చేసేందుకు అని శేఖర్ కమ్ముల నిరూపించారు అని నాగ్ తెలిపారు.సాయి పల్లవి అద్భుతంగా నటిస్తారని ఆమె డాన్స్ చేస్తుంటే చుట్టూ 100 మంది సాయి పల్లవులు డాన్స్ చేసినట్టు ఉంటుందని తాను ఏ క్యారెక్టర్ చేసిన ఒక మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని నాగ్ తెలిపారు.
ఇక చైతూ గురించి మాట్లాడుతూ.తనని చూస్తుంటేనే కడుపు నిండిపోతుందని నాగ్ తన ప్రేమను వ్యక్తం చేసారు.యాక్టర్ వేరు స్టార్ వేరు.చైతు ఒక స్టార్ యాక్టర్ గా చుపించావ్ కొత్త జర్నీ అందించావ్.నాన్న నువ్వు ఫెంటాస్టిక్ అంటూ నాగ్ తన పుత్ర ప్రేమను తెలిపారు.తెరమీద సినిమా చూస్తూ నేను నవ్వేలా చేసావ్.
ఏడ్చేలా చేసావ్.చాలా బాగా నటించవని చైతూ కి కితాబు ఇచ్చారు.
ఇలా నాగ్ చైతు పై ప్రేమను బయట పెట్టాడు.