కరోనాపై అవగాహణకు ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.కొందరు పాటలు పాడుతుంటే మరికొందరు స్కిట్స్ చేస్తున్నారు.
కొందరు పేరడీలు చేస్తున్నారు.తాజాగా కింగ్ నాగార్జున నటించిన శివమణి సినిమాలోని పూర్ణ మార్కెట్ సీన్ చాలా కీలకం అనే విషయం తెల్సిందే.
ఆ సీన్లో రౌడీలకు శివమణి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇకపై రౌడీయిజం, వసూళ్లకు పాల్పడితే ఇరగదీస్తానంటూ రౌడీలకు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చే సన్నివేశంను కరోనా వైరస్ అవగాహణకు అనుగుణంగా మార్చేశారు.
ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు భవిరి రవి వాయిస్తో వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏకంగా నాగార్జున ఈ వీడియోను షేర్ చేసి ఇప్పుడు దర్శకుడు పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తే పూర్ణ మార్కెట్ సన్నివేశంను ఇలాగే తెరకెక్కించమని చెప్పేవాడిని అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.
పూరి ఈ డైలాగ్కు నిజంగానే ఇలాగే సీన్ పెట్టేవాళ్లం సర్ అంటూ నాగార్జున ట్వీట్కు సమాధానం ఇచ్చాడు.
ఇక ఈ వీడియోలో… నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్, ఇప్పటి వరకు కూడా మాస్క్లు లేకుండా రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు.మటన్ అని చికెన్ అని బయటకు వస్తే మళ్లీ తిరిగేందుకు లేకుండా అంటూ జనాలకు శివమణి వార్నింగ్ ఇస్తూ వీడియోలో ఉంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోతో అయినా జనాల్లో కనీసం మార్పు రావాలని పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.