బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ఎనిమిదో వారం పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.ఈ వారం అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, మెహబూబ్ మరియు అరియానాలలో ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
అయితే నామినేషన్స్ లేని నోయల్ పలు అనారోగ్య సమస్యల కారణంగా వీకెండ్కు ముందే ఇంటిని వీడాడు.అయితే నోయల్ ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు.
త్వరలోనే పూర్తి ఆరోగ్యవంతులై తిరిగి రావాలని బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు.
దీంతో నోయల్ మళ్లీ బిగ్బాస్లోకి రీఎంట్రీ ఇస్తాడని ప్రేక్షకులతో పాటు ఇంటి సభ్యులు కూడా భావించారు.
అయితే నిన్నటి ఎపిసోడ్లో నోయల్ బిగ్ బాస్ హౌస్లోకి మళ్లీ వస్తాడా.రాడా.అన్న దానిపై నాగార్జున క్లారిటీ ఇచ్చేశారు.నిన్నటి ఎపిసోడ్లో నోయల్కి సెండాఫ్ ఇచ్చేందుకు నాగార్జున స్టేజ్ మీదకు పిలిచారు.
ఇక స్టేజ్మీదకు వచ్చిన నోయల్.ఇంటి సభ్యులతో మాట్లాడి కాసేపు సందడి చేశాడు.
అలాగే హౌస్లో ఎవరు ఎన్ని అన్నా సైలెంట్గా ఉన్న నోయల్.స్టేజ్పై మాత్రం తన బాధనంతా కక్కేశారు.ముఖ్యంగా తన ఆరోగ్యంపై జోకులు వేసిన అమ్మ రాజశేఖర్, అవినాష్లకు క్లాస్ పీకాడు నోయల్.తనకు ఆంక్లియో స్పాంటిలైటిస్ ఉందని, హౌస్లోకి వెళ్లిన ఫస్ట్ వీక్లోనే కాళ్ల నొప్పి స్టాట్ అయిందని నోయల్ వివరించాడు.
అయినా సరే ఆ నొప్పిని భరిస్తూ.అందర్నీ ఎంటర్టైన్ చేశానని నోయల్ చెప్పుకొచ్చాడు.
ఈ క్రమంలోనే అవినాష్ మొదట ఫైర్ అయినప్పటికీ.ఆ తర్వత మోకాళ్లపై నిలబడి రెండు చేతులు జోడించి నోయల్కి సారీ చెప్పాడు.ఇక నోయల్ తిరిగి హౌస్లోకి వస్తాడని ఇంటి సభ్యులు భావించారు.కానీ, నోయల్ మళ్లీ హౌజ్లోకి రాడని నాగార్జున చెప్పేశారు.
అనంతరం అతడికి సెండాఫ్ ఇచ్చారు.