నాగార్జున మరియు నాగ చైతన్య లు హీరోలుగా నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ సినిమా లో నాగచైతన్య కు జోడిగా ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టి నటించిన విషయం తెలిసిందే.
ఇక నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటించింది.వీళ్లు కాకుండా ఈ సినిమా లో చాలా మంది హీరోయిన్లు ఐటెం సాంగ్స్ ను మరియు ముఖ్య పాత్ర ల్లో నటించినట్లు సమాచారం అందుతోంది.
ఇక ఈ సినిమా కు సంక్రాంతి సీజన్ కలిసి వస్తుందని అంతా అనుకుంటున్నారు.ఎందుకంటే జక్కన్న సినిమా ఆర్ .ఆర్.ఆర్ మరియు ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ లు రెండూ కూడా ఈ సంక్రాంతికి రావటం లేదు.ఆ కారణంగా సంక్రాంతికి వస్తున్న పెద్ద సినిమా ఒకే ఒక్కటి ఈ సినిమా.కనుక ఈ సినిమా విడుదల కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సినిమాకు జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బంగారు రాజు సినిమా విడుదల అవుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కరోనా 3వ వేవ్ విపరీతంగా కనిపిస్తుంది.ఈ సమయంలో నాగార్జున టీం నుండి క్లారిటీ వచ్చింది.కచ్చితంగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామంటూ వారు ప్రకటించారు.
దానికి తోడుగా నేడు ట్రైలర్ ను కూడా విడుదల చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ట్రైలర్ విడుదల అయితే సినిమా విడుదల అవ్వడం పక్కా.ఎందుకంటే మళ్ళీ ట్రైలర్ విడుదల చేసి వాయిదా వేస్తే అదొక టెక్నిక్ సమస్య అవుతుంది.అందుకే ట్రైలర్ విడుదల అవుతుంది కనుక సంక్రాంతికి బంగార్రాజు వస్తాడని నమ్మకం ప్రతి ఒక్కరిలో కనిపిస్తుంది.
మరి సినిమా విడుదల చేసి నాగ్ సూపర్ హిట్ ను దక్కించుకుంటాడా అనేది చూడాలి.బాక్స్ లు బద్దలు అయ్యేలా వసూళ్లు వస్తాయా అనేది కూడా చూడాలి.