టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోలు సైతం కాంబినేషన్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
సీనియర్ హీరోలైన వెంకటేష్, నాగార్జున ఇప్పటికే ఈ దారిలోకి వచ్చి సోలో సినిమాల కంటే ఎక్కువగా మల్టీ స్టారర్ కథలకి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఒకప్పటిలా హీరోయిన్స్ తో రొమాన్స్ అంటే ఆడియన్స్ తమని రిసీవ్ చేసుకోవడం లేదని వారు భావిస్తున్నారు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాడు.ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో వెంకటేష్ తో జత కట్టాడు.
ఇక తాజాగా మహర్షి సినిమాలో అల్లరి నరేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీ స్టారర్ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
దాని తర్వాత కింగ్ నాగార్జున, మహేష్ బాబు మల్టీ స్టారర్ సినిమా గురించి చర్చ నడుస్తుంది.సోషల్ మీడియాలో ఈ న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది.
ప్రముఖ దర్శకుడు తాజాగా కింగ్ నాగార్జునని కలిసి ఒక కథ నేరేట్ చేశాడని అది నాగ్ కి నచ్చడంతో చేయడానికి ఒకే చెప్పాడని తెలుస్తుంది.ఇక ఈ కథనే మహేష్ బాబుకి చెప్పడానికి అయన అపాయిట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడని, ఇప్పటికే సింగిల్ లైన్ స్టొరీని మహేష్ బాబుకి చెప్పాడని, అతను ఇంప్రెస్ అయ్యాడని టాక్ వినిపిస్తుంది.
ఈ కాంబినేషన్ సెట్ అయితే టాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ అవ్వడం గ్యారెంటీ అనే మాట బలంగా వినిపిస్తుంది.