అక్కినేని మల్టీస్టారర్ ను నిర్మించనున్న మెగాస్టార్.. నిజమేనా?

అక్కినేని హీరోలు మరో మల్టీ స్టారర్ కు రెడీ అవుతున్నారా.అంటే అవుననే సమాధానం వస్తుంది.

 Nagarjuna And Akhil In A Multi Starrer With Mohan Raja, Akkineni Family, Akhil,-TeluguStop.com

ఎప్పటిలాగా ఈసారి నాగ చైతన్య- నాగార్జున కాకుండా నాగార్జున- అఖిల్ కలిసి మల్టీ స్టారర్ చేయబోతున్నారు అని టాక్.ఈ మల్టీ స్టారర్ కు కర్త కర్మ క్రియ మెగాస్టార్ అని వార్త షికారు చేస్తుంది.

మెగాస్టార్ కు నాగార్జున కు మధ్య ఉన్న స్నేహం గురించి అందరికి తెలుసు.వీరి స్నేహం కారణంగానే చిరు చెప్పాడని నాగ్ మల్టీ స్టారర్ సినిమాకు ఓకే చెప్పాడని సమాచారం.

అది కూడా తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో ఈ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.మోహన్ రాజా ప్రెజెంట్ చిరంజీవి తో గాడ్ ఫాథర్ సినిమా చేస్తున్న విషయం విదితమే.

ఈ క్రమంలోనే అక్కినేని మల్టీ స్టారర్ కథ విషయంలో కూడా చిరు కీలక పాత్ర పోషించినట్టు కథనాలు వస్తున్నాయి.

మోహన్ రాజా చిరుకి స్టోరీ లైన్ చెప్పగా ఆయన అక్కినేని నాగార్జున, అఖిల్ అయితే బాగుంటారు అని సజెస్ట్ చేయగా ఈ మల్టీ స్టారర్ ఓకే అయ్యిందట.

అంతేకాదు ఇప్పుడు మరొక వార్త వైరల్ అయ్యింది.నాగార్జున-అఖిల్ కాంబోలో రాబోతున్న మల్టీ స్టారర్ సినిమాను చిరంజీవి నిర్మాతగా మారి నిర్మించ బోతున్నట్టు టాక్ బయటకు వచ్చింది.

Telugu Akhil, Akkineni, Chiranjeevi, Mohan Raja, Naga Chaitanya, Nagarjuna, Naga

మోహన్ రాజా ఒక డిఫరెంట్ ఇన్నోవేటివ్ స్టోరీ రెడీ చేసినట్టు ఇప్పటికే ఈ అక్కినేని హీరోలకు వినిపించినట్టు కూడా టాక్.ఈ కథ బాగుండడంతో అక్కినేని హీరోలు వెంటనే ఓకే చెప్పారట.ఈ సినిమా అనుకున్నట్టు పట్టాలెక్కితే మెగాస్టార్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube