కింగ నాగార్జున ఇప్పుడు సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్తా గా ఉంటున్నాడు.తన వయసుని దృష్టిలో పెట్టుకొని మరి సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.
తాజాగా అయన సోలోగా నటించిన మన్మధుడు 2 చిత్రం ఫ్లాప్ అవ్వడంతో తదుపరి సినిమా చెయ్యడానికి నాగ్ సమయం తీసుకుంటున్నాడు.ప్రస్త్తుతం సల్మాన్ అనే కొత్త దర్శకుడి తో ఓ సినిమా చేయ్యనున్నాడు కానీ ఈ సినిమాలో నాగ్ ఓన్లీ గెస్ట్ పాత్రలో మాత్రమే కనిపిస్తాడు.
ఇంతకు ముందు శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన ‘నిర్మల కాన్వెంట్’ చిత్రంలో కనిపించిన నాగ్ ఇప్పడు అదే తరహాలో ఆ సినిమాలో కనిపించనున్నాడు.కాకపోతే ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్లో, నాగ్ చుట్టూ తిరిగే కథ ఇది.ఆ చిత్రంలో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేయ్యనున్నట్లు సమాచారం.ఆ చిత్రంలో హీరో హీరోయిన్స్ గా కొత్త వాళ్ళు పరిచయం కానున్నారు.
హీరో సంగతి పక్కన పెడితే హీరొయిన్ గా మాత్రం కొత్తగా సౌత్ అమ్మాయి ని తీసుకుంటారని ఫిల్మ్ నగర్ నుండి అందుతున్న సమాచారం.ప్రస్త్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.
త్వరలోనే పూర్తి వివరాలు తెలుస్తాయి.