ప్రతిపక్షాలు మాత్రం ఎప్పుడు ఏడుపు మొఖమే

ఏపీలో వరసగా ఆలయాలపై దాడులు, విగ్రహాలను ద్వంసం చెయ్యడం పై అధికార పార్టీ పై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.అందుకు బదులుగా అధికార పార్టీ మంత్రులు, ఎం‌ఎల్‌ఏ లు ప్రతి విమర్శలు చేస్తున్నారు.

 Nagari Mla Roja Slams Opposition Party Leaders, Mla Roja, Opposition Party Leade-TeluguStop.com

ప్రభుత్వం చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకపోతున్నారు.అందుకే ప్రతిపక్ష నాయకులు మత పరమైన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఆలయాలపై దాడులను సాకుగా చూపుతూ ప్రభుత్వంకు ప్రజల నుండి చెడ్డ పేరును తీసుకువస్తున్నారు.ఈ విషయంపై వైసీపీ నగరి ఎం‌ఎల్‌ఏ రోజా విమర్శలు చేసింది.

ప్రజలు సంతోషం గా ఉండటాని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి తట్టుకోలేకపోతున్నారు.వారిది ఎప్పుడు ఏడుపుగొట్టు మొఖమే అన్నారు.
ఏపీలో అసలైన సంక్రాంతి డిసెంబర్ 25 న మొదలైంది.ప్రతి ఒక్క మహిళ పేరు మీదుగా ఇళ్ళపట్టాల పంపిణీ మరియు వారికి ఇల్లు కట్టించడం ద్వారా సమాజములో వారికి గుర్తింపు కలిగించవచ్చని ఆమె అన్నారు.

జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిన ప్రతిసారి వాటిని దారి మళ్లించడానికి ప్రతిపక్ష నాయకులు కుట్రలు చేస్తున్నారు.సంక్షేమ పథకాల తేదీలు సమీపిస్తున్నప్పుడే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.

కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోజా సూచించారు.జగన్ చేస్తున్న మంచిని దేశ ప్రధాని నరేంద్ర మోడి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అభినందిస్తున్నారని రోజా గుర్తు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube