ఏపీలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలకు చేరువ అయ్యేందుకు నాయకులు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నారు.ఏదో ఒకరకంగా ప్రజల్లోకి దూసుకువెళ్లి వాళ్ళ అభిమానాన్ని ఓట్ల రూపంలో సంపాదించుకునేందుకు నాయకులు సరికొత్త ఆలోచనలు చేస్తున్నారు.
ప్రస్తుతం అంతా ఆన్లైన్ అయిపోవడంతో ఆ దిశగా కూడా చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు… నగరి ఎమ్యెల్యే ఆర్కే రోజా ఈ రోజు మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు.
‘మై ఎమ్మెల్యే-రోజా సెల్వమణి’ పేరుతో ఈ యాప్ ను తయారు చేయించారు .ఈ విషయమై రోజా మాట్లాడుతూ.ప్రజలకు మరింత చేరువ అయ్యేందుకే యాప్ ను తీసుకొచ్చామన్నారు.నగరిలో గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి పనులను యాప్ ద్వారా ప్రజల ముందుకు తీసుకెళతామన్నారు.అలాగే నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ యాప్ ద్వారా తనకు ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు.దీని ద్వారా అపాయింట్ మెంట్ కూడా తీసుకోవచ్చని పేర్కొన్నారు.