ఒక్కోసారి కొందరు నటీనటులు తమ ప్రమేయం లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి మొదట్లో బాగానే ఆకట్టుకున్నప్పటికీ తాము నటించిన చిత్రాలలోని పాత్రల విషయంలో గానీ లేదా కథల విషయంలో గానీ సరైన నిర్ణయాలు తీసుకోక తెరమరుగైన నటీనటులు ఎందరో ఉన్నారు.అప్పట్లో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి మా ఛానల్ లో ప్రసారమయ్యే “నాగమ్మ” సీరియల్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.
అయితే ఈ ధారావాహికలో నాగమ్మ పాత్రలో నటించినటువంటి చైల్డ్ ఆర్టిస్ట్ “గాయత్రి” సినీ ప్రేక్షకులకి ఇప్పటికీ బాగానే గుర్తుంటుంది.
అయితే ఈ సీరియల్ లో నటించిన గాయత్రికి సినిమా పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపయితే వచ్చింది.
కానీ గాయత్రి తన చిత్రాల కథల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది.ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు తనయుడు “రాజీవ్” హీరోగా నటించినటువంటి “నోట్ బుక్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొంతమేర ఫర్వాలేదనిపించినా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు మాత్రం తెచ్చి పెట్టలేక పోయింది.
దీంతో గాయత్రి కి తమిళంలో ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడంతో వెంటనే మూటాముల్లె సర్దుకొని చెన్నైకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ కూడా ఈ అమ్మడికి చెప్పుకోవటానికి సరైన హిట్ లేకపోవడంతో పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు. దీంతో అప్పుడప్పుడు కొంత మేర బోల్డ్ మరియు వ్యాంప్ తరహా పాత్రలను కూడా నటింనటించింది.
అయినప్పటికీ అవకాశాలను మాత్రం దక్కించుకోలేకపోయింది.దీంతో ప్రస్తుతం ఎలాంటి సినిమా అవకాశాలు లేకుండా ఇంటి పట్టునే ఖాళీగా గడుపుతోంది.
దీంతో ఈ మధ్యనే ధారావాహికలలో కూడా నటించేందుకు సిద్ధమైనట్టు గాయత్రి చెబుతున్నప్పటికీ దర్శకనిర్మాతలు మాత్రం ఆమెకు అవకాశాలు ఇచ్చే విషయంలో కొంతమేర వెనకడుగు వేస్తున్నారు.
అయితే ఇందుకు గల కారణాలు లేకపోలేదు.
గతంలో గాయత్రి సినిమా అవకాశాల కోసం చేసినటువంటి ఎక్స్ పోజింగ్ మరియు బోల్డ్ తరహా పాత్రలు ఆమె సీరియల్ అవకాశాలపై పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది.ఏదేమైనప్పటికీ చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా పరిశ్రమలో గుర్తింపు తెచ్చుకున్నంత మాత్రాన హీరోయిన్ గా కూడా రాణిస్తారని అంచనా వేయడం తప్పని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.