ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల మరోసారి సాయి పల్లవి హీరోయిన్ గా పెట్టి నాగచైతన్య తో కలిసి లవ్ స్టోరీ అనే సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.సెన్సిబుల్ ప్రేమ కథలను తెరకెక్కించే దర్శకుడుగా పేరుపొందిన శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంపై కొన్ని వర్గాల ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది.తన మార్క్ సినిమాలతో టాలీవుడ్ లో ఇప్పటికి తన ప్రతిభ ఏమిటో శేఖర్ కమ్ముల నిరూపించుకున్నారు.
ఇప్పటికే ఆయన ఫిదా సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ ఈ సినిమాకు సంబంధించిన టీజర్, అలాగే ఓ పాట బాగా రెస్పాన్స్ రానే వచ్చింది.
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ బయటికి వచ్చింది.లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో తాజాగా మళ్లీ షూటింగ్ మొదలుపెట్టి పూర్తి అయినట్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెలియజేశారు.
దీంతో లవ్ స్టోరీ సినిమా కు చిత్ర యూనిట్ సభ్యులు శుభం కార్డ్ వేసారు.ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ తెలుపుతున్న సమయంలో హీరోయిన్ సాయి పల్లవి, దర్శకుడు శేఖర్ కమ్ముల, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్.
సినిమా కంప్లీట్ అయినట్లు 2 చేతులతో థమ్సప్ సింబల్ చూపిస్తున్నారు.
హీరో నాగచైతన్య మజిలీ వెంకీ మామ సినిమాలో తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా లో నటించారు.ఈ సినిమాకి ఎ.ఆర్.రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతాన్ని ఇస్తున్నాడు.ఈ సినిమా కథ విషయానికొస్తే.
ఓ పల్లెటూరు నుండి పట్టణానికి వచ్చి వారు ఏదో సాధించాలని కోరుకునే వారి ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథగా తెరకెక్కింది.ఈ సినిమాలో హీరో నాగచైతన్య పూర్తిగా తెలంగాణ యాసలో మాట్లాడే విధంగా రోల్ క్రియేట్ చేశారు.
అలాగే మరోసారి హీరోయిన్ సాయి పల్లవి కూడా తెలంగాణ యాస లోనే కనబడుతోంది.