ఆహా ఓటీటీ వేదికగా సమంత సామ్ జామ్ అనే షోను హోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.సామ్ జామ్ సీజన్ 1 చివరి ఎపిసోడ్ నిన్న ప్రసారం కాగా నాగ చైతన్య ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యారు.
సాధారణంగా నాగ చైతన్య మంచి నటుడని క్లాస్ సినిమాల్లో అయినా, మాస్ సినిమాల్లో అయినా బాగా నటిస్తాడని మనందరికీ తెలుసు.అయితే తనలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ గురించి సామ్ జామ్ షో సందర్భంగా చైతన్య చెప్పుకొచ్చారు.
ఈ షోలో చైతన్య తాను సంగీతం బాగా నేర్చుకున్నానని కీబోర్డును బాగా వాయిస్తానని చెప్పుకొచ్చారు.ట్రినిటీ కాలేజ్ ఆఫ్ లండన్ లో 4 సంవత్సరాల పాటు కీబోర్డును నేర్చుకున్నానని అన్నారు.
అన్ని సంవత్సరాలు నేర్చుకోవడంతో ఇప్పటికీ కీబోర్డును బాగా వాయిస్తానని చైతన్య చెప్పుకొచ్చారు.చిన్నప్పటి నుంచి కీబోర్డు నేర్చుకోవడం అంటే తనకు ఎంతో ఇష్టమని నాగ చైతన్య ఈ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నిజ జీవితంలో సమంత నాగచైతన్య భార్యాభర్తలు కావడంతో ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సామ్ జామ్ సీజన్ 1 నిన్నటి ఎపిసోడ్ తో పూర్తి కాగా రెండో సీజన్ ఉండదని తెలుస్తోంది.సమంతకు ఈ షో ద్వారా కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా దక్కినట్టు సమాచారం.సామ్ జామ్ షో పూర్తి కావడంతో సమంత కూడా వరుస షూటింగ్ లతో బిజీ కానున్నారని తెలుస్తోంది.
సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమా కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసి సెట్లు వేస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమాలో నటిస్తున్నారు.దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తుండగా ఈ ఏడాది సెకండాఫ్ లో సినిమా విడుదల కానుంది.