చైతన్య సమంత విడాకుల ప్రకటన ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలను ఆశ్చర్యపోయేలా చేసింది.ఎంతో అన్యోన్యంగా ఉన్న జంట ఎందుకు విడిపోయిందో అర్థం కావడం లేదంటూ సెలబ్రిటీలలో చాలామంది అభిప్రాయపడ్డారు.
విడిపోయిన తర్వాత చైతన్య, సమంత వేర్వేరు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.విడిపోయే సమయంలో స్నేహితులలా విడిపోతున్నామని చైతన్య, సమంత చెప్పినా వాళ్లిద్దరూ కలిసి పని చేసే అవకాశం అయితే లేదని తెలుస్తోంది.
అయితే అక్కినేని ఫ్యామిలీ చైసామ్ లను కలిపే ప్రయత్నం చేస్తోందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.చైసామ్ మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బోగట్టా.పెళ్లి చేసుకున్న ఇద్దరు వ్యక్తులు విడిపోవడం తేలికైన విషయం కాదు.విడిపోతే ఆ బాధను స్వీకరించడం కూడా ఎంతో కష్టమైన పని అనే సంగతి తెలిసిందే.
అక్కినేని, సమంత కుటుంబ సభ్యులు చర్చించి సమస్య పరిష్కారం దిశగా ముందుకు వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
చైతన్య సమంత కలిస్తే అభిమానులు కచ్చితంగా ఎంతో సంతోషిస్తారని చెప్పాల్సిన అవసరం లేదు.
చైసామ్ విడిపోవడం వల్ల చాలామంది అభిమానులు బాధ పడ్డారు.
చైతన్య, సమంత విడాకుల తర్వాత వాళ్లు విడిపోవడానికి ఇవే కారణాలంటూ చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.చైతన్య థాంక్యూ, బంగార్రాజు సినిమాలతో పాటు ఒక వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
సమంత రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించడంతో పాటు త్వరలో ఆ సినిమాల రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొననున్నారు.సమంత నటించిన శాకుంతలం సక్సెస్ సాధిస్తే సమంత కెరీర్ పుంజుకునే ఛాన్స్ ఉంది.శాకుంతలం మూవీ తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా రిలీజ్ కానుంది.
వచ్చే ఏడాదిలో ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో దుశ్యంతుని పాత్రను పోషిస్తున్నారు.