ఈ ఏడాది జనవరి నెల 9వ తేదీ తరువాత నాలుగు నెలల పాటు మంచి మూహూర్తాలు లేకపోవడంతో మే నెలలో రికార్డు స్థాయిలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి.గతేడాది చాలామంది సెలబ్రిటీల వివాహాలు జరగగా నాగబాబు కూతురు నిహారిక వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది.
నిహారిక వివాహం జరగడంతో ఇప్పుడు వరుణ్ వంతు వచ్చింది.మెగా ఫ్యాన్స్ వరుణ్ వివాహం గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నాగబాబు ఇన్ స్టాగ్రామ్ లైవ్ చాట్ ద్వారా నెటిజన్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుండగా ఒక నెటిజన్ విచిత్రమైన సలహా ఇచ్చాడు.వరుణ్ తేజ్ కు హీరోయిన్ సాయిపల్లవికి మ్యారేజ్ చేస్తే బాగుంటుందని సూచించాడు.
కొన్ని రోజుల క్రితం నెటిజన్లకు మంచి సంబంధాలు ఉంటే చెప్పమని నాగబాబు చెప్పగా ఒక నెటిజన్ ఈ విధంగా కామెంట్ పెట్టారు.నెటిజన్ అలా చెప్పడంతో నాగబాబు సైతం అవాక్కయ్యారు.
ఏం చేయాలో పాలుపోని నాగబాబు జాతిరత్నాలు సినిమాలో బ్రహ్మానందం జడ్జి స్థానంలో కూర్చున్న ఫోటోను పెట్టారు.మీరే తీర్పు చెప్పుకోండి నేను జడ్జి ప్లేస్ నుంచి వెళ్లిపోతానంటూ ఎక్స్ ప్రెషన్ వచ్చే ఫోటో పెట్టారు.ఈ మధ్య కాలంలో నెటిజన్లు సెలబ్రిటీలకు విసుగు తెప్పించేలా ప్రశ్నలు వేస్తూ ఉండటం గమనార్హం.నెటిజన్లు అడిగే ప్రశ్నలు సెలబ్రిటీలకు చిరాకు తెప్పిస్తున్నాయి.
శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఫిదా సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమా సాయిపల్లవికి తొలి తెలుగు సినిమా కాగా వరుణ్, సాయిపల్లవి యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడంతో పాటు ఈ సినిమా కమర్షియల్ గా హిట్టైన సంగతి తెలిసిందే.
బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.