వాడంత పెద్ద ఎదవ ఉండరంటూ కామెంట్స్ చేసిన నాగబాబు.. వైరల్ అవుతున్న పోస్ట్?

మెగా బ్రదర్ నాగబాబు బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిపోవడంతో కొన్ని సంవత్సరాలు పాటు పార్టీకి దూరంగా ఉంటూ బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Nagababu Shocking Comments Goes Viral On Social Media Details, Nagababu,janasen-TeluguStop.com

అయితే వచ్చే ఎన్నికలలో పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నారు నాగబాబు.ఈ క్రమంలోనే ఈయన పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారిపోయి అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు రాజకీయాలలోనూ ఎంతో బిజీగా గడుపుతున్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పరోక్షంగా ఇతరులపై సెటైర్లు వేయడం, వారికి తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ ఉంటారు.అయితే ఈయన ఎవరిని ఉద్దేశించి ఆ పోస్టులు చేశారు అనేది మాత్రం ఆలోచించి తీరాల్సిందే.

ఈ క్రమంలోనే తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ఉద్దేశిస్తూ తనకు కావలసిన వారి గురించి కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందిస్తూ.సాధారణంగా మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను.ఒకవేళ తాను ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత పెద్ద ఎదవ ఒకరు ఉండరు అంటూ ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.అయితే ఈ పోస్ట్ తప్పనిసరిగా నాగబాబు తన సన్నిహితులను ఉద్దేశించి చేశారని, మరి నాగబాబుకు దూరమైన ఆ పెద్ద ఎదవ ఎవరో తెలియాల్సి ఉంది.

మొత్తానికి ఈయన చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube