మెగా బ్రదర్ నాగబాబు బుల్లితెర కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.అయితే 2019లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఓడిపోవడంతో కొన్ని సంవత్సరాలు పాటు పార్టీకి దూరంగా ఉంటూ బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
అయితే వచ్చే ఎన్నికలలో పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు పూర్తి మద్దతు తెలుపుతున్నారు నాగబాబు.ఈ క్రమంలోనే ఈయన పూర్తిస్థాయి పొలిటీషియన్ గా మారిపోయి అధికార పార్టీపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
ఇలా ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలతోనూ మరోవైపు రాజకీయాలలోనూ ఎంతో బిజీగా గడుపుతున్న నాగబాబు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పరోక్షంగా ఇతరులపై సెటైర్లు వేయడం, వారికి తనదైన శైలిలో కౌంటర్లు వేస్తూ ఉంటారు.అయితే ఈయన ఎవరిని ఉద్దేశించి ఆ పోస్టులు చేశారు అనేది మాత్రం ఆలోచించి తీరాల్సిందే.
ఈ క్రమంలోనే తాజాగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా ఉద్దేశిస్తూ తనకు కావలసిన వారి గురించి కామెంట్లు చేశారు.ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా నాగబాబు స్పందిస్తూ.సాధారణంగా మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను.ఒకవేళ తాను ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత పెద్ద ఎదవ ఒకరు ఉండరు అంటూ ఈ సందర్భంగా నాగబాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు.అయితే ఈ పోస్ట్ తప్పనిసరిగా నాగబాబు తన సన్నిహితులను ఉద్దేశించి చేశారని, మరి నాగబాబుకు దూరమైన ఆ పెద్ద ఎదవ ఎవరో తెలియాల్సి ఉంది.
మొత్తానికి ఈయన చేసిన ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.