తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉండే నటులలో సమీర్ ఒకరనే సంగతి తెలిసిందే.దూరదర్శన్ కార్యక్రమాల ద్వారా, ధారావాహికల ద్వారా కెరీర్ ను మొదలుపెట్టిన సమీర్ శుభసంకల్పం సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో కెరీర్ ను మొదలుపెట్టారు.
సింహాద్రి, లక్ష్మీ, మగధీర, స్టైల్, పిల్ల జమీందార్ సినిమాలు సమీర్ కు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి.తాజాగా ఒక ఇంటర్వ్యూలో సమీర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అనవసర విషయాలలో తాను ఇన్వాల్వ్ కానని సమీర్ వెల్లడించారు.మంచి ప్రవర్తనతో వివాదాలకు దూరంగా ఉండటం తనకు ఇష్టమని సమీర్ పేర్కొన్నారు.రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్, రఘు కారుమంచి తనకు మంచి స్నేహితులని సమీర్ వెల్లడించారు.రాఘవ, అనిల్, కళ్యాణ్, కౌశిక్ వీళ్లంతా టెలివిజన్ బ్యాచ్ స్నేహితులు అని సమీర్ పేర్కొన్నారు.
మనం ఏ పాత్రకు సూట్ అయితే ఆ పాత్రకే అవకాశం ఇస్తారని సమీర్ వెల్లడించారు.
సంప్రదాయం సినిమా కోసం గండిపేటకు రమ్మని చెప్పగా ఆలస్యంగా సమాచారం తెలియడంతో ఆ రోల్ మిస్సయ్యానని సమీర్ పేర్కొన్నారు.
ఇంద్ర 175 రోజుల ఫంక్షన్ కు షీల్డ్ తీసుకున్నానని అది ఇంటికి రాలేదని సమీర్ చెప్పుకొచ్చారు.ఠాగూర్ సినిమా సమయంలో చిరంజీవి గారిని అడిగితే చిరంజీవిగారు తనకు కూడా షీల్డ్ రాలేదని సమీర్ అన్నారు.హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ బాగా క్లోజ్ అని సమీర్ వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ నటించిన కొమరం పులి సినిమా నచ్చకపోవడంతో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టగా నాగబాబు గారు సీరియస్ అయ్యారని సమీర్ పేర్కొన్నారు.ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఫోన్ చేశారని నాగబాబుకు ఫోన్ చేసి నేను చూసుకుంటా చెప్పు అని కాల్ లో అన్నారని సమీర్ వెల్లడించారు.