బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ ఒకటి.జబర్దస్త్.తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఆదరణ పొందుతున్న షో.అభిమానులను వివిధ కామెడీ స్కిట్ లతో గత కొన్ని సంవత్సరాల నుంచి తమ బాధల్ని మర్చిపోయేట్టు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అంటే అందరికీ మక్కువే.
అయితే ఈ షో కి జడ్జ్ లుగా ఇంతకుముందు నాగబాబు, రోజా నిర్వహించే వారు.కానీ కొన్ని కారణాల వల్ల నాగబాబు ఆ షో నుంచి బయటకు వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే.
అంతే కాకుండా ప్రముఖ ఛానెల్ లో అదిరింది అనే ప్రోగ్రామ్ ను కూడా జబర్దస్త్ కి పోటీగా పెట్టారనే వార్తలు కూడా వచ్చాయి.కానీ కొంతకాలం నుంచి ఆ షో ని ఆపేశారు.
ఏదేమైనప్పటికీ జబర్దస్త్ మళ్ళీ తన సత్తాను నిరూపించుకుంది.దీంతో నాగబాబు తిరిగి ఆ షోకి వస్తారనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ అవుతున్నాయి.
ఈ విషయంపై స్పందించిన నాగబాబు, ఇద్దరు జబర్దస్త్ లో చేసే యువకులు తన దగ్గరికి వచ్చి మళ్ళీ మునుపటిలా షోకి రమ్మని అడిగారని ఆయన చెప్పారు.రాకుండా ఉండడానికి కారణాలేం లేవు.
ఈటీవీ వాళ్ళు , మల్లెమాల వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ ఆ షోకి వస్తానని నాగబాబు స్పష్టం చేశారు.తాను వచ్చే ముందు మెంబర్స్ కి, కుర్రవాళ్ళు కొన్ని ఇష్యూస్ అయ్యాయి.దానికి స్పందించి తాను వెళ్ళిపోయానని ఆయన తెలిపారు.అవన్నీ ఇప్పుడు సాల్వ్ అయ్యాయని, ఇప్పుడు మళ్లీ జబర్దస్త్ కి వెళ్ళడానికి తనకేం అభ్యంతరం లేదని నాగబాబు తెలిపారు.
మరి నాగబాబు జబర్దస్త్ కార్యక్రమానికి ఎంట్రీ ఇస్తే.అతని స్థానంలో జడ్జిగా కొనసాగుతున్న మనో జబర్దస్త్ నుంచి తప్పుకోవాల్సిందేనా అంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.