టాలీవుడ్ మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి సోదరుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగబాబు నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు.
సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు నాగబాబు.హీరోగా, సహనటుడిగా, నిర్మాతగా ఇలా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించి ప్రేక్షకులకు చేరువ అయ్యాడు.
కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెరపై కూడా తన సత్తాను నిరూపించుకున్నాడు.బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ కూడా నటించాడు.
అలాగే బుల్లితెరపై ప్రసారం అయ్యే పనులు షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.ఇది ఇలా ఉంటే ఇటీవల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ లాంటివి కూడా చేస్తుంటాడు మన మెగా బ్రదర్.ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు నాగబాబు చేసే వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతుంటాయి.
ఈ క్రమంలోని తాజాగా సోషల్ మీడియాలో నాగబాబు చేసిన ఒక ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే చాలా కాలం పాటు అటు సినిమాల్లో, ఇటు టీవీలో తనదైన హవాను చూపించిన మెగా బ్రదర్, సినిమాలలో కానీ బుల్లితెర పై కానీ అంతగా కనిపించడం లేదు.అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు సినిమాల,షోల సంఖ్యను పూర్తిగా తగ్గించారు నాగబాబు.కాగా జనసేన పార్టీ తరపున చురుకుగా కార్యక్రమాలలో పాల్గొంటూ, తరచూ పర్యటనలు చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తల్లో జోష్ ని నింపుతున్నారు నాగబాబు.
తరచు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నాగబాబు నిత్యం తనదైన పోస్టులతో వార్తల్లో నిలుస్తూ ఉంటున్నారు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మెగా బ్రదర్ తన ట్విట్టర్లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
ఆ ట్వీట్ లో మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను.ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు అంటూ రాసుకొచ్చారు నాగబాబు.అయితే ఎప్పుడూ నాగబాబు ఏ ట్వీట్ చేసిన దాని వెనుక ఎంతో కారణం ఉంటుందని ఆయన అభిమానులు నమ్ముతూ ఉంటారు.అయితే తాజాగా ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది.