పిచ్చికుక్కలతో వచ్చిన నాగబాబు.. బాలయ్య ఫ్యాన్స్ ఏం పట్టుకొస్తారో?

ప్రస్తుతం టాలీవుడ్‌లో నాగబాబు, బాలకృష్ణల మధ్య ముదురుతున్న వివాదం తీవ్ర స్థాయికి చేరుతోంది.ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో నిర్వహించిన సమావేశంలో తనను పిలువలేదని బాలయ్య బహిరంగంగా చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.

 Nagababu New Tweet On Mad Dogs, Nagababu, Balakrishna, Ccc, Tollywood News-TeluguStop.com

దీంతో టాలీవుడ్‌లో విబేధాలు ఉన్నాయనే విషయం మరోసారి బట్టబయలైంది.

కాగా బాలయ్య చేసిన కామెంట్స్‌పై నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

బాలయ్య సినీ ఇండస్ట్రీతో పాటు తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఆయన డిమాండ్ చేశారు.కాగా తాజాగా నాగబాబు ప్రజల ఆరోగ్య శ్రేయస్సు కోసం పిచ్చి కుక్కల నుండి దూరంగా ఉండాలని ఆయన తెలిపారు.

‘పిచ్చి కుక్కలను బంధించాలి లేదా వాటికి ఇంజెక్షన్ ఇప్పించాలని, లేదంటే అవి చాలా ప్రమాదకరమని, అసలే ఇది పిచ్చికుక్కల కాలం’ అని ఆయన ట్వీట్ చేశారు.

దీంతో ఈ సందేశం ఇన్‌డైరెక్ట్‌గా బాలయ్యను ఉద్దేశించే నాగబాబు చేశారని పలువురు మండి పడుతున్నారు.

ఇక నాగబాబు వెంటనే ఈ ట్వీట్ చేయాలని లేకపోతే ఆయన తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని బాలయ్య ఫ్యాన్స్ హెచ్చరిస్తున్నారు.మరి నాగబాబుకు కౌంటర్‌గా బాలయ్య ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

పిచ్చికుక్కలతో వచ్చిన నాగబాబు.బాలయ్య ఫ్యాన్స్ ఏం పట్టుకొస్తారో?

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube