టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి కోడలు, యంగ్ హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఈమె అపోలో వైస్ చైర్మన్ బాధ్యతలు చేపడుతుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ ప్రజలకు ఆరోగ్య సమస్యల గురించి ఉచిత సలహాలు ఇస్తుంది.అంతేకాకుండా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా తన వంతు సహాయం చేస్తుంది.
ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలకు కూడా తన హాస్పిటల్ తరఫున ట్రీట్మెంట్ అందించింది.ఇదిలా ఉంటే తాజాగా ఉపాసన పై నాగబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు.
టాలీవుడ్ మెగా హీరో నాగబాబు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.అంతేకాకుండా అభిమానులతో కూడా తెగ ముచ్చటిస్తుంటాడు.ప్రస్తుతం పలు ప్రాజెక్టుల లో బిజీగా ఉండగా.తన కోడలు ఉపాసన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపాడు.కోవిడ్ సమయంలో ఆయన చాలా మందికి ట్రీట్మెంట్ చేయించానని తెలిపాడు.కానీ ఆ విషయం మీడియాకు కూడా తెలియదని సందర్భం వచ్చింది కాబట్టి తెలుపుతున్నానని అన్నాడు.
అంతేకాకుండా మెగా ఫ్యామిలీ హీరోలకు చేసిన సహాయం గురించి చెప్పుకోవడం ఇష్టం ఉండదని తెలిపాడు.కష్టకాలంలో తన అన్నయ్య చిరంజీవి ఎంతోమందిని ఆదుకున్నారని.చేసుకున్న సేవ గురించి చెప్పడం అన్నయ్యకి ఇష్టం ఉండదని తెలిపాడు.ఇక కళ్యాణ్ కూడా జనసేన పార్టీ తరఫున, మెగా ఫ్యాన్స్ తరఫున ఎంతో మందికి సేవలు చేశాడని తెలిపాడు.
ఇక తమ పిల్లలు కూడా తమ వంతు సహాయం తో సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నారని వివరించాడు.
ఇక తన అన్నయ్య కోడలు ఉపాసన ఎంతో మందికి సహాయం చేసిందని.అపోలో ఆస్పత్రిలో చాలా తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ అందించారని తెలిపింది.ఇక తను ఉపాసన ని ఎంత తక్కువకి ఎలా చేస్తున్నావ్ అని అడిగితే.
ఇలాంటి సమయంలో పదిమందికి ఉపయోగపడాలి అని.నార్మల్ టైం లో మనం కమర్షియల్ గా ఉన్నప్పటికీ ఇలాంటి సమయంలో సేవ చేయాలి అని ఉపాసన అనడంతో తనకి సంతోషం వేసిందని తెలిపాడు.అంతే కాకుండా మా అన్నయ్య కి తగ్గ కోడలు అనిపించిందని.తన అన్నయ్య కూడా ఉపాసన ద్వారా ఎన్నో సేవలు చేయించారని తెలిపాడు.కోడలి యొక్క సంపూర్ణ సహకారం అన్నయ్యకు ఉందని తెగ పొగిడాడు.