మెగా బ్రదర్ నాగబాబు పొలిటికల్ ఎంట్రీ ఇస్తారు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ మధ్య అందుకు తగ్గట్టుగా నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.సోషల్ మీడియాలో ఆయన అంతకు ముందుకంటే ఎక్కువగా… యాక్టివ్ గా కనిపిస్తున్నారు.ముఖ్యంగా….సినీనటుడు హిందూపూర్ తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణని టార్గెట్ చేస్తునట్టు కనిపిస్తోంది.
మొన్న ఆ మధ్య ‘బాలయ్య ఎవరో నాకు తెలియదు’ అనేశారు నాగబాబు.ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు .
తాజాగా కొన్ని దున్నపోతులు, కుక్కల ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నాగబాబు, ఆ ఫొటోల్లోని జంతువుల బ్రీడ్స్, బ్లడ్ ‘రేర్’ అని చెప్పుకొచ్చారు.కావాల్సిన వారు కొనుకోండి అంటూ చెప్పుకొచ్చారు.మొదట్లో అర్ధం కాకపోయినా ఆయన మళ్ళీ బాలయ్య ను టార్గెట్ చేస్తున్నారని అర్ధం అవుతూనే ఉంది.మొన్న ఒక సందర్భంలో ‘మా బ్రీడ్ వేరు, మా బ్లడ్ వేరు.’ అని చెబుతాడు బాలయ్య బాబు.దానికి కౌంటర్గా నాగబాబు ఇప్పుడిలా సోషల్ మీడియాలో.
పోస్ట్ చేయడం వీరిద్దరి మధ్య మరింత వైరం పెంచేలా కనిపిస్తోంది.