మెగా ఫ్యామిలీ మరియు నందమూరి ఫ్యామిలీ ల మద్య పైకి బాగానే ఉన్నట్లుగా అనిపించినా కూడా ఎప్పుడు కూడా విభేదాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.నందమూరి బాలకృష్ణ గతంలో పలు సార్లు మెగా ఫ్యామిలీపై విరుచుకు పడ్డ సందర్బాలు ఉన్నాయి.
బాలయ్య వ్యాఖ్యలకు చిరంజీవి ఎప్పుడు స్పందించకున్నా నాగబాబు మాత్రం ఖచ్చితంగా స్పందించాడు.ఎప్పుడు స్పందిస్తూనే ఉంటాడు.
ఆ మద్య బాలకృష్ణ గురించి నాగబాబు చేసిన వ్యాఖ్యలు చాలా పెద్ద దుమారం రేపాయి.ఒకానొక సమయంలో నాకు బాలకృష్ణ అంటే ఎవరో తెలియదు అని కూడా నాగ బాబు మాట్లాడాడు.
నాగబాబు చేసిన వ్యాఖ్యలను నందమూరి అభిమానులు అంత ఈజీగా మరిచి పోరు అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పుడు ఆ గొడవలు అన్ని మరిచి పోయి స్వయంగా నాగబాబు వెళ్లి బాలకృష్ణ ఇంట్లో తన కూతురు పెళ్లి కి రావాల్సిందిగా ఆహ్వానం ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి.
నిహారిక వివాహంలో బాల కృష్ణ పాల్గొనాల్సిందిగా నాగ బాబు కార్డ్ ఇచ్చాడు అంటూ వస్తున్న వార్తలు నవ్వు తెప్పించేవిగా ఉన్నాయి.అయితే నిహారిక పెళ్లికి బాలకృష్ణ వెళ్లేది ఖచ్చితంగా అబద్దం అనిపిస్తుంది.
ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కవ మందిని గెస్ట్లను పిలవడం లేదు.గెస్ట్లు కూడా పిలిచినా కూడా కరోనా భయంతో పెళ్లిలు ఇతర వేడుకల్లో పాల్గొనేందుకు భయపడుతున్నారు.
ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఆ పెళ్లికి వెళ్లడం అంటే ఖచ్చితంగా నిజం అయ్యి ఉండదు.నాగబాబు అన్ని మాటలు అన్నా కూడా మళ్లీ ఎలా వెళ్తాడు అంటున్నారు.
మెగా మరియు నందమూరి ఫ్యామిలీ ల మద్య ఉన్న గొడవలు అన్ని ఇన్ని కావు.అలాంటిది ఇప్పుడు వారు ఎలా ఒకరి పెళ్లి కి మరొకరు వెళ్తారు అంటున్నారు.