ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో ఖాళీ అవుతుందని, జడ్జ్లు, యాంకర్స్ నుండి కమెడియన్స్ వరకు అంతా కూడా షోను వదిలేస్తున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే నాగబాబు జీ తెలుగులో ఒక షోను చేసేందుకు సిద్దం అయ్యాడు.
యాంకర్ రవి మరియు ప్రదీప్లతో కలిసి నాగబాబు చేయబోతున్న ఈ ప్రయత్నం తాలూకు ఏర్పాట్లు కూడా ప్రారంభం అయ్యాయి.ఇక జబర్దస్త్ నుండి రాబోతున్న వారు ఎవరు అనే విషయమై చర్చ జరుగుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మల్లెమాల వారితో హైపర్ ఆది, సుధీర్ ఇంకా ఇతర కమెడియన్స్ ఒప్పందం చేసుకున్న కారణంగా వెంటనే వారు అక్కడ నుండి వెళ్లిపోయే పరిస్థితి లేదు.ఆ బాండ్ను బ్రేక్ చేస్తే వారికి లీగల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అందుకే వారిని రమ్మంటూ నాగబాబు బలవంత పెట్టలేదట.నాగబాబు సూచన మేరకు పాత జబర్దస్త్ కమెడియన్స్ జీ తెలుగు షోకు సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి జబర్దస్త్ నుండి కేవలం నాగబాబు మాత్రమే వెళ్లి పోయాడు.కనుక షోకు వచ్చిన నష్టం ఏమీ లేదంటూ కొందరు అంటున్నారు.నాగబాబు మాత్రమే వెళ్లడం వల్ల జీ తెలుగులో కొత్తగా ప్రసారం కాబోతున్న కామెడీ షో ఏ మేరకు సక్సెస్ అవుతుందో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.మొత్తానికి నాగబాబు రెంటికి చెడ్డ రేవడు అవ్వబోతున్నాడా అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.