మెగా హీరోలలో ఒకరైన వరుణ్ తేజ్ రాజకీయాలకు, వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.ముకుంద సినిమా నుంచి వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతి సినిమా భిన్నమైన కథాంశంతో తెరకెక్కింది.
భిన్నమైన కథలతోనే విజయాలను అందుకుంటూ వరుణ్ తేజ్ మెగా హీరోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించారు.అయితే వరుణ్ తేజ్ కు గని ఫలితం ఊహించని స్థాయిలో షాకిచ్చింది.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కనీస స్థాయిలో కూడా కలెక్షన్లను సాధించడంలో ఫెయిలైంది.అయితే కొంతమంది మాత్రం నాగబాబు రాజకీయాలు వరుణ్ తేజ్ పై ఎఫెక్ట్ చూపిస్తున్నాయని కామెంట్లు చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో నాగబాబు వైసీపీని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే నాగబాబుపై ఉండే కోపం వల్ల వైసీపీ సానుభూతిపరులు గని మూవీ చూడటానికి దూరంగా ఉన్నారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ ఎదుగుతున్న సమయంలో నాగబాబు వైసీపీని టార్గెట్ చేస్తూ ఉండటంతో ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఈ సినిమాకు సహాయసహకారాలు లభించలేదు.మరోవైపు తెలంగాణ సర్కార్ టికెట్ రేట్లు తగ్గించడం కూడా ఈ సినిమాపై కొంతమేర ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి.
సినిమాలు, రాజకీయాలు వేర్వేరు అయినప్పటికీ ఒకదానిపై మరొకటి ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే.
మరోవైపు 2022 సంవత్సరం నాగబాబు ఫ్యామిలీకి కలిసిరాలేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నిహారిక వివాదంలో చిక్కుకోవడం, గని సినిమా ఫ్లాప్ కావడంతో నాగబాబు ఫ్యామిలీ తరచూ వార్తల్లో నిలుస్తోంది.గని సినిమాకు 80 శాతం నష్టాలు తప్పవని సమాచారం.
వరుణ్ తేజ్ ఈ సినిమాకు సంబంధించి తన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని తగ్గించుకునే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.వరుణ్ తేజ్ ఎఫ్3 సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి.