పవన్ కళ్యాణ్ దేశ వ్యాప్తంగా చిక్కుకు పోయిన వలస కార్మికులపై స్పందిస్తూ చేసిన ట్వీట్పై వైకాపా నేత ఎమ్మెల్యే అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.ఈ సమయంలో రాజకీయాలు ఏంటీ అంటూ అసహనం వ్యక్తం చేయడం జరిగింది.
అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను జనసైనికులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.ఈసమయంలో మీరు పవన్ కళ్యాణ్ను విమర్శించే హక్కు అస్సలు లేదు.
మీరు పవన్ను విమర్శించేంత స్థాయిలో లేరు అంటూ పలువురు జనసైనికులు కామెంట్స్ చేశారు
అంబటి రాంబాబుపై జనసేన నాయకుడు నాగబాబు కూడా తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.ఇలాంటి విపత్తు సమయంలో వెధవ రాజకీయాలు ఏంటీ అంబటి రాంబాబు గారు.
కరోనా సమయంలో ఎన్నికలు వాయిదా వేస్తే ఎన్నికల కమీషన్ను ఇష్టానుసారంగా తిట్టకుండా పవన్ తనకు చేతనైన సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.అలాంటి వ్యక్తిపై మీరు విమర్శలు చేస్తే రాజకీయంగా ఇప్పుడు విమర్శలు చేసేందుకు ప్రయత్నిస్తే మీపై జనాలు ఉమ్ము వేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.